కోయిలకొండ, మే 13 : ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మండల కోఆప్షన్ సభ్యుడు ఖాజా అన్నారు. గురువారం మండల కేంద్రంలో రంజాన్ తోఫాలను ము స్లింలకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కృషితో మసీదుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు నజీమ్ పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, మే 13 : మండలంలోని పెద్దరేవల్లి, మొదంపల్లి గ్రామాల్లో ముస్లింలకు గురువారం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సూదిని శివానందరెడ్డి రంజాన్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమాల్లో మండల కోఆప్షన్ సభ్యుడు జమీర్పాషా, సర్పంచులు నర్మదాలింగారెడ్డి, సువర్ణాగురుపాదం, ఉపసర్పంచ్ లతీఫ్, శశికాంత్రెడ్డి, మతీన్ తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, మే 13 : మండలంలోని పుట్టపల్లిలో గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ శ్రీనివాస్ ముస్లింలకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. చిన్నచింతకుంట మండలంలోని వడ్డేమాన్ గ్రామం లో సర్పంచ్ ఫర్జానాబేగం తోఫాలను అందజేశారు.
టీఆర్ఎస్తోనే మైనార్టీల అభివృద్ధి
మూసాపేట(అడ్డాకుల), మే 13 : టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మైనార్టీల అభివృద్ధి జరుగుతుందని జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు పొన్నకల్ మహెమూద్ సూచించారు. మండలంలోని పొన్నకల్ గ్రామంలో గురువారం ముస్లింలకు రంజాన్ దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విజయ్కుమార్రెడ్డి, మన్యంకొండ, కావాలి కృష్ణయ్య, సాయిలు, యాద య్య, ఇమామ్ అజమత్ సభ్యులు అబ్దుల్ ఖాదర్, సూకూర్, అలీమ్, ఖుర్షిత్, వలీమ్, అజీద్, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మూసాపేట, మే 13 : మండలంలోని జానంపేటలోని మైనార్టీ సామూహిక భవనం వద్ద గురువారం ముస్లింలకు రంజాన్ పండుగను పురస్కరించుకొని దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సత్తార్, సర్పంచ్ కావలి శ్రీనివాసులు, ఉపసర్పంచ్ అనిల్కుమార్రెడ్డి, నాయకులు ఇమ్రాన్, ఎండీ ఖదీర్, బంగ్లా బాబా, ఎండీ యూనిస్, చెన్నయ్య పాల్గొన్నారు.