నారాయణపేట, అక్టోబర్ 27 : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిన బీజేపీ నాయకుల తీరును నిరసిస్తూ గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి మోడీ డౌన్ డౌన్, అమిత్షా డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
మరికల్లో రాస్తారోకో
మరికల్, అక్టోబర్ 27: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని దుష్ట చర్యకు పాల్పడ్డ బీజేపీ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను గురువారం మండల కేంద్రంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు దహనం చేశారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి కోఆర్డినేటర్ సంత్కుమార్, వైస్ ఎంపీపీ రవికుమార్, ఎంపీటీసీ గోపాల్, మండల కోఆప్షన్ సభ్యుడు మతీన్, పార్టీ మండలాధ్యక్షుడు తిరుపతయ్య, కార్యదర్శి కృష్ణారెడ్డి, నాయకులు శ్రీనివాసులు, రాజేశ్, జగదీశ్, కృష్ణయ్య, కొండారెడ్డి, చంద్రశేఖర్, నర్సింహులు పాల్గొన్నారు.
చిల్లర రాజకీయాలు మానుకోవాలి
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నానికి నిరసనగా గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో కేంద్ర ప్రభుత్వం దృష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. కేంద్రం చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు ఆశన్న, ఎంపీపీ బక్క నర్సప్ప, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ భీమయ్యగౌడ్, పట్టణాధ్యక్షుడు అశోక్గౌడ్ పాల్గొన్నారు.
కేంద్రం దిష్టిబొమ్మ దహనం
నారాయణపేట, అక్టోబర్ 27: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు కొనుగోలు చేయడానికి చేసిన ప్రయత్నాలను నిరసిస్తూ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను గురువారం నారాయణపేటలో దహనం చేశారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు విజయ్సాగర్, జెడ్పీటీసీ అంజలి, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, నాయకులు సుదర్శన్రెడ్డి, గందెచంద్రకాంత్, ప్రతాప్రెడ్డి, చెన్నారెడ్డి, కన్నజగదీశ్, శేఖర్రెడ్డి, బండి శివరాంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కార్తీక్ పాల్గొన్నారు.
దుర్మార్గపు చర్యలు
ధన్వాడ, అక్టోబర్ 27: బీజేపీ దుర్మార్గపు చర్యలు చేపట్టిందని ధన్వాడ సర్పంచ్ అమరేందర్రెడ్డి అన్నారు. గురువారం టీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు ధన్వాడలో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూడడం నీతిమాలిన చర్యగా పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు సుధీర్కుమార్రావు, కొండారెడ్డి, సచిన్, శాంతికుమార్, బాలయ్య, నర్సింహారెడ్డి, వీరేశ్గౌడ్, చంద్రశేఖర్, బాలరాజు, వసీం, సునీల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.