నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 13 : తెలంగాణ జాతీ య సమైక్యత వజ్రోత్సవాలను ఈనెల 16 నుంచి 18 వర కు ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు చేయాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణపై మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 16న నా రాయణపేట, మక్తల్ మున్సిపాలిటీల్లో భారీ ర్యాలీ నిర్వహించి, ర్యాలీకి వచ్చిన వారికి భోజనాలు పెట్టి పంపించాలన్నారు. నారాయణపేటలో ర్యాలీలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ శెట్టి ఫంక్షన్ హాల్, మక్తల్లో ర్యాలీలో పాల్గొన్న వారికి ద్వారకా ఫంక్షన్ హాల్లో భోజనం వసతి ఏర్పాటు చేయాలన్నారు. దాదాపు 10వేల జాతీయ పతాకాలను ర్యాలీలో ఇవ్వాల్సి ఉంటుందని, పతాకాలకు కర్రలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. 8వ తరగతి, ఆపై చదువులు చదువుతున్న విద్యార్థులను మాత్రమే ర్యాలీకి పిలవాలని, స్వయం సహాయక సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు ర్యా లీలో పాల్గొనేలా చూడాలన్నారు.
ర్యాలీకి 108, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. 17న పరేడ్ మైదానంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఉం టుందన్నారు. అదేరోజు హైదరాబాద్లోని ఎన్టీఆర్ గార్డెన్లో సీఎం కేసీఆర్ పాల్గొనే కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి 20 బస్సుల్లో గిరిజన ప్రజాప్రతినిధులు, గిరిజన ఉద్యోగులు, గిరిజన మహిళా సంఘాల ప్రతినిధులను పంపించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం 8 గంటలకు ఆయా ప్రాంతాల నుంచి బస్సులు బయల్దేరుతాయని, ఉదయం 5గంటలకు బస్సులను మండలాలకు, మున్సిపాలిటీలకు పంపించాలన్నారు. 18న పట్టణంలోని అంజనా గార్డెన్ ఫంక్షన్ హాల్లో సాంస్కృతిక కార్యక్రమా లు నిర్వహిస్తామన్నారు. 15 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలపై త్రివర్ణ రంగు విద్యుత్ లైట్లు పెట్టించి అం దంగా అలంకరించాలన్నారు. వజ్రోత్సవాల్లో ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, పద్మజారాణి, ఆర్డీవో రాంచందర్ నాయక్, డీఎస్పీ సత్యనారాయణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.