నారాయణపేట, మే 5 : ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్ర వారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా ని ర్వహించనున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ పరీక్షల నిర్వహణకుగానూ జిల్లాలో 18 ప రీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రతి సెంటర్లో మంచినీటి సదుపాయాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేపట్నున్నారు. ఈనెల 6 నుంచి 23వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గం టల వరకు పరీక్షలు నిర్వహించున్నారు. ఉదయం 8:30 గంటల లోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని నిబంధన విధించారు. మరో పక్క ఇంటర్ పరీక్షల కోసం ఆర్టీసీ అధికారులు సైతం బస్సులను నడిపిస్తున్నారు. నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేయనున్న సెంటర్ల సంఖ్య, హాజరు కా నున్న విద్యార్థుల సంఖ్య ఈ విధంగా ఉంది.
పరీక్షలు రాయనున్న 9,186 మంది విద్యార్థులు
జిల్లాలో మొత్తం పరీక్షా కేంద్రాలకు సంబంధించి ప్రభు త్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రథమ, ద్వితీయ సంవత్సరం 9,186 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాబుతున్నారని, పరీక్షల్లో మాస్ కాపీయింగ్ను నిరోధించుటకు ప్లయింగ్ స్కాడ్ బృందాలను, సిట్టింగ్ స్కాడ్ బృందాలతోపాటు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు ఆకస్మి కంగా తనిఖీలు చేయనున్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
కరోనా నేపథ్యంలో రెండేండ్ల తర్వాత నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏ ర్పాట్లు చేపట్టారు. ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాలకు చీఫ్లను, చీఫ్ సూపరింటెండెంట్లను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తం గా 9,186 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేం ద్రా ల వద్ద ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశా రు. భద్రతా నేపథ్యంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు విధించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిమిషం ఆలస్యమైనా పరీక్షా సెంటర్కు అనుమతి లేదు. కేంద్రాల వద్ద పూ ర్తిస్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు, పరీక్షా సమయం లో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని నిర్వాహకులకు ఆ దేశాలు జారీ చేశారు.