నారాయణపేట టౌన్, ఏప్రిల్ 3: పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ తదితర చమురు ఉత్పత్తులపై ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నదని సీపీఎం జిల్లా కార్యదర్శి బాలరాం అన్నారు. సీపీఎం జాతీయ కమిటీ పిలుపు మేరకు ఆదివారం మండలంలోని కోటకొండ గ్రామంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వంటగ్యాస్ తదితర చమురు ఉత్పత్తుల పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ.99వేల కోట్లు ఉండగా, నేడు రూ.4లక్షల కోట్ల రూపాయలను ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్నారు. సీపీఎం జిల్లా నాయకుడు బాలప్ప మాట్లాడుతూ కొద్ది మంది కోటీశ్వరులకు లక్షల కోట్లు పన్ను రాయితీలు కల్పిస్తూ ప్రజలపై పన్ను భారాలు వేయడం సరికాదని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి దస్తప్ప, సీపీఎం నాయకులు నరేశ్, సీఐటీయూ జిల్లా నాయకుడు కృష్ణయ్య, డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు గోవిందు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మన్యం, దినకర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించాలి
మాగనూర్ ఏప్రిల్ 3: ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీం జిల్లా కార్యవర్గ సభ్యుడు భరత్ కుమార్ అన్నారు. అదివారం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి నరేశ్ , వెంకటయ్య ఆంజనేయులు పీ వెంకటయ్య కే నర్సింహులు, రాఘవేంద్ర, నబీసాబ్ వాకిటి శ్రీను, తరుణ్ పాల్గొన్నారు.
దామరగిద్దలో..
దామరగిద్ద ఏప్రిల్ 3: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరను వెంటనే తగ్గించాలని మండంలోని పలు గ్రామాల్లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ముస్తాపేట గ్రామంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం అనంతరం ఎంపీటీసీ అంజిలయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించి సామాన్య ప్రజలను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.