నారాయణపేట టౌన్, మార్చి 29 : కేంద్రం ప్రైవేటీకర ణ విధానాలను విరమించుకొని ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు గోపా ల్ అన్నారు. సీఐటీయూ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో రెం డో రోజూ మంగళవారం పట్టణంలో చేపట్టిన సార్వత్రిక స మ్మె విజయవంతంగా ముగిసింది. పట్టణంలోని మున్సిపల్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నాకు ఆయన ముఖ్యఅతిథి గా హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లోని కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని, ప్రభుత్వం అవలంబిస్తున్న వినాశకర ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా సమ్మె చేపట్టినట్లు ఆయన తెలిపారు. అధిక ధరలను నియంత్రించాలని, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధ్దరించాలన్నారు. కార్పొరేట్ల కోసం కాకుండా కష్ట జీవులకు మేలు కలిగేలా విధానాలను రూపొందించాలన్నారు. సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, సీపీ ఐ ఎంఎల్ ప్రజాపంథ జిల్లా కార్యదర్శి రా ము, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాలరాం, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి కిరణ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కొండన్న మాట్లాడు తూ సరళీకరణ, ప్రపంచీకరణ-ప్రైవేటీకరణ తదితర వినాశకర విధానాలను ప్రభుత్వాలు అనుసరించడం మొదటుపెట్టిన నాటి నుంచి దేశంలోని కోట్లాది మంది శ్రామికులు, సా మాన్య ప్రజలు అనేక బాధలు పడుతున్నారన్నారు.
అంగన్వాడీ, ఐకేపీ, ఆశ మధ్యా హ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు అ మలు కావడం లేదన్నారు. అంతకుముందు పార్క్ నుంచి పాతబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గో పాల్, రైతు సంఘం జిల్లా కన్వీనర్ అంజిలయ్యగౌడ్, ఆర్పీ ల సంఘం జల్లా అధ్యక్షురాలు సౌభాగ్య, అంగన్వాడీ, ఆ శ, మున్సిపల్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.