నారాయణపేట రూరల్, మే 30 : నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అధికారిపై వేటు పడింది. అక్రమాలకు పాల్పడిన ఏవోను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని నారాయణ పేట మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న ఎస్.నాగరాజు నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని అతడిపై అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఫెర్టిలైజెర్స్, ఏఈఓలు, రైతు సంఘాల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు నిధుల దుర్వినియోగం వాస్తవమేనని తేల్చారు.
2019 – 20 మార్క్ ఫెడ్, 2020 -21 అగ్రోస్ -ఎన్ఎఫ్ఎస్ఎం, 2018 -19, 2020-21 టీఎస్ ఎస్.డి.సి, ఎస్.వి.పి,. ఎన్.ఎఫ్.ఎస్.ఎం ద్వారా మంజూరైన జింక్ విత్తనాల నాన్ సబ్సిడీ డబ్బులను దుర్వినియోగం చేశాడని, మద్యం సేవించి ఆఫీస్ కు వస్తున్నాడని, రైతుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నడని విచారణలో తేలింది. దీంతో ఆయన పై సస్పెన్షన్ వేటు వేస్తూ అగ్రికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ నుంచిడి స్థానిక ఉత్తర్వులు జారీ చేశారు.