నారాయణపేట రూరల్: ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం ఒక్క పీఆర్టీయూతోనే సాధ్యమని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంజనా గార్డెన్లో జిల్లా అధ్యక్షుడు తిమ్మారె డ్డి అధ్యక్షతన జరిగిన పీఆర్టీయూ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్ రెడ్డి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు త్వరలోనే పదోన్నతులు, బదిలీలు రాబోతున్నాయన్నారు. త్వరలోనే 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పెన్షన్ జీవో రాబోతుందన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా మన్నారు. హెల్త్ కార్డుల విషయంలో ఒక్క శాతం బేసిక్ పే డిడక్షన్తో అన్ని దవాఖానల్లో క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ వచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు.
త్వరలోనే పండిత్, పీఈటీల అక్రిటేషన్ 10వేల పీఎస్హెచ్ఎంల పదోన్నతులు రాబోతున్నాయన్నారు. సీపీ ఎస్ విధానం రద్దు కోసం ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతామన్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రా వు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయ కత్వం నిరంతరం పని చేస్తున్నదన్నారు. పీఆర్సీ ఎరియల్స్ రిటైర్మెంట్ తర్వత కాకుండా ముందుగా ఇచ్చే విధంగా సంఘం కృషి చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు నర్సింహా రెడ్డి వివిధ మండల అధ్యక్ష, కార్యద ర్శులు లకా్ష్మరెడ్డి, శ్రీనివాస్, రఘువీర్, జనార్ధన్, వెంకట్రెడ్డి, శేఖర్, సత్యనారాయణరెడ్డి, విశ్వనాథ్, వాణిశ్రీ, రియా జుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.