నారాయణపేట టౌన్: గ్రామాలలో ఆరు బయట చెత్త వేయకుండా ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని, వాటి ద్వారా కంపోస్ట్ను తయారు చేసి విక్రయించడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని కలెక్టర్ హరి చందన అధికారులకు సూచించారు. సోమవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఎంపీడీవోలు, ఎంపీవోలతో ఓడీఎఫ్ ప్లస్ కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడారు.
గ్రామాల్లో ప్రజలు బహిరంగ మలమూత్ర విసర్జనకు వెళ్లకుండా ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, నీటిని రోడ్డు పై వదలకుండా ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణాలకు స్థలం లేని వారి కి కమ్యూనిటీ ఇంకుడు గుంతలు నిర్మిం చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇంత వరకు మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు కట్టుకోని వారిని గుర్తించి నిర్మాణాలు పూర్తి చేసేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాను ఇప్పటికే బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించడం జరిగిందని, అందులో భాగంగా ఓడీఎఫ్ ప్లస్ను అమలు చేయాలని చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్లు నిర్మించాలని, ప్రతి విద్యా సంస్థలో బాలికలకు, బాలురకు మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మరుగుదొడ్ల నిర్మాణా లపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఏ ఒక్కరు కూడా బహిరంగ మలమూత్ర విసర్జన చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు.
ప్రతి రోజూ గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, అధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లో 100శాతం ఓడీఎఫ్ ప్రక టించడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలని లేనిపక్షంలో చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్డీవో గోపాల్నాయక్, పీఆర్ ఈఈ నరేందర్, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.