మక్తల్ రూరల్: త్వరలోనే ప్రభత్వం ఉపాధ్యాయ పదోన్నతులు చేపడుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. గురువారం మక్తల్ మండలంలోని కర్ని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఆయా సమస్యలపై సంఘాల నాయకులతో కూలంకశంగా చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు.
అలాగే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పీఈటీలు, పండిత్ల అఫ్గ్రేడేషన్ విషయమై ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. పాఠశాలల్లో పార్ట్టైం ఇన్స్పెక్టర్స్, స్కావెంజర్స్ను తిరిగి నియమించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. కర్ని జడ్పీ హెచ్ఎస్ పాఠశాలలో అసం పూర్తిగా ఉన్న అదనపు గదుల నిర్మాణానికి ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ.4 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్, ఉపాధ్యాయులు కలిసి ఎమ్మెల్సీ జనార్ధన్రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాక ర్ రావులను ఘనంగా సన్మానించారు. అలాగే మక్తల్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఎమ్మెల్సీ సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ వృత్తి చేపట్టి 38సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న ఉపాధ్యాయురాలు అరుణను సన్మానించారు.
కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.జనార్ధన్రెడ్డి, మండల కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప, ఉపాధ్యక్షుడు తిరుపతి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అనిల్గౌడ్, ప్రసాద్, రాజశేఖర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.