మరికల్: ఆగస్టు 29: నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని పల్లెగడ్డ గ్రామస్తులు దేవాదాయ శాఖ భూమిలో నిర్చించుకున్న ఇండ్లను ఖాళీ చేయాలని కోర్టు నుండి ఉత్తర్వులు పంపించడంని నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి ఖండించారు. వందేళ్ల పైబడి ఇండ్ల నిర్మాణం చేసుకొని ప్రభుత్వానికి కరెంటు బిల్లులు, పంచాయతీ టాక్స్ కడుతున్న పల్లెగడ్డ గ్రామస్తులకు అధికారులు ఏ విధంగా నోటీసులు జారీ చేస్తారని ప్రశ్నించారు.
2018లో 11 మందికి నోటీసులు జారీ చేయగా అప్పటి జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో మాట్లాడి పల్లె గడ్డ గ్రామంలోని ఇల్లు నిర్మించిన భూమిని గ్రామకంఠభూమిగా మార్చాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని తెలిపారు. గ్రామస్తులు అధైర్య పడుద్దని వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కోర్ట్ నుండి నోటీసులు వస్తే సొంతంగా లాయర్ ను ఏర్పాటు చేసి పల్లె గడ్డ గ్రామస్తులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తానన్నారు. ఈ నెలలో మరో 25 మందికి నోటీసులు రావడంతో వారు భయాందోళన గురవుతున్నారని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
గ్రామంలో ఇండ్లతోపాటు పాఠశాల, గ్రామపంచాయతీ భవనాన్ని కూడా నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గౌని సురేఖ రెడ్డి, మరికల్ మండలం మాజీ వైస్ ఎంపీపీ రవికుమార్, మండల పార్టీ అధ్యక్షుడు లంబడి తిరుపతయ్య, సీనియర్ నాయకులు రాజా వర్ధన్ రెడ్డి, సంపత్ కుమార్, మండల కార్యదర్శి కృష్ణారెడ్డి, నాయకులు మురళి, హనుమంతు, హనుమ రెడ్డి, వీర బసంత్, రామస్వామి, నారాయణ, హచ్ శ్రీనివాసులు, మథిన్, రఘు, తదితరులు పాల్గొన్నారు