మక్తల్ : బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మక్తల్ పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో కేటీఆర్ పేరుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయించారు.
పూజల అనంతరం పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానం చేపట్టారు. కేటీఆర్ భవిష్యత్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాని, నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.