మక్తల్ రూరల్, జూలై 25 : కృష్ణానదికి వరదపోటెత్తడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చ ర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం మండలంలోని పస్పుల గ్రామ శి వారులోని ప్రసిద్ధ దత్తాత్రేయస్వామి ఆ లయం వద్ద పుష్కర ఘాటో వద్ద ఉన్న కృష్ణవేణి విగ్రహానికి వరద నీరు తాకిం ది. దీంతో మండలంలోని నదీ తీరంలో ఉన్న పంచదేవ్పహాడ్, పస్పుల, అను గొండ, దాదానపల్లి, అంకెన్పల్లి తదితర ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. నదీ తీరం వెంబడి గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని ఎ గువన ఉన్న నారాయణపూర్ డ్యాం నుంచి గేట్లు ఎత్తి దిగువకు కృష్ణానదిలోకి భారీగా వరద నీరు విడుదల చేశారు. ప్రస్తుతం 3.5లక్షల క్యూసెక్యుల నీరు దిగువకు జూరాల ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో పరీవాహక ప్రాంతం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చే యాలని ఎస్పీ చేతన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మక్తల్ సీఐ శంకర్, ఎస్సై రాము లు ఆయా ముంపు గ్రామాలను సందర్శించి కృష్ణానదిలో వరద నీటిని అంచనా వేశారు. పస్పుల, ముస్లాయపల్లి, పంచదేవ్పహాడ్ పుష్కర ఘాట్ల వ ద్ద వరద ఉధృతిని పరిశీలించారు. పుష్కర ఘాటో వద్ద కృష్ణవేణి విగ్రహం వద్దకు వరద నీరు వచ్చి చేరింది. దీంతో దత్తాత్రేయ క్షేత్రంలో స్వాములను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఉ దయం నుంచి వరదనీరు పెరుగుతూ, తగ్గుతూ రావడం వల్ల ఎప్పుడైనా ఉధృతి పెరిగే అవకాశం ఉందని ఎవరూ నదీతీరం వెంబడి తిరుగరాదని ఎస్సై రాములు హెచ్చరించారు. స్థానిక జాలర్లతో మాట్లాడి పరిస్థితిని అంచనా వేశారు. వరదనీరు పూర్తిగా తగ్గుముఖం పట్టెవరకు పోలీసులను విధుల్లో ఉంచినట్లు సీఐ శంకర్ చెప్పారు.