కోయిలకొండ, అక్టోబర్ 1 : పాలమూరు ఎత్తిపోత ల పథకంతో గ్రామాలు సస్యశ్యామలం అవుతాయ ని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి పే ర్కొన్నారు. ఆదివారం మండలంలోని అయ్యవారిపల్లి, కానుగుబండతండా, ఉబ్బడితండా, పలుగుతండా, చింతల్తండా, మోదీపూర్, నల్లవెల్లి, అ భంగపట్నం, రాజునాయక్తండాలో ఎమ్మెల్యే ప ర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రా రంబోత్సవాలు చేసి మాట్లాడారు. అభివృద్ధి పథకాల అమలుతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామం దశ మార్చామన్నారు. బీఆర్ఎస్ హయాంలో జీ పీలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. నల్లవెల్లి, అభంగపట్నంలో పంచాయతీ భవనాలను అద్భుతంగా నిర్మించడంపై స ర్పంచులు ఆంజనేయులు, మాధవిరెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు.
అనంతరం మోదీపూర్ ఆంజనేయస్వామి ఆలయంలో రూ.50లక్షలతో నిర్మిస్తున్న కల్యాణ మండప పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీరామకొండ ఆలయ చైర్మన్ రవీందర్రెడ్డి, ఎంపీపీ శశికళ, జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, రైతుబంధు కన్వీనర్ మల్లయ్యయాదవ్, సర్పంచులు విజయశ్రీ, అనిత, శాంతిబాయి, స్వ ప్న, ఆంజనేయులు, మా ధవిరెడ్డి, సక్రియాబా యి, ఎంపీటీసీలు, నా యకులు, అధికారు లు పాల్గొన్నారు.