కోయిలకొండ, మార్చి 17 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం కోయిలకొండ, మోదీపూర్, జమాల్పూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించా రు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నట్లు చెప్పారు. పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటకలో రైతుబంధు, ఆసరా పింఛన్, క ల్యాణలక్ష్మితోపాటు మరెన్నో పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి పేద ఇంటికీ సం క్షేమ పథకాలు అందించడమే లక్ష్యమన్నారు. గత ప్రభుత్వాల పాలనలో పల్లెలు అభివృద్ధికి ఆమడదూరంలో నిలిస్తే తెలంగాణ ప్రభుత్వ హయాంలో ప్రగతి పరుగులు పెడుతున్నదని చెప్పారు.
కోయిలకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు గ దుల నిర్మాణానికి రూ.60 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. జమాల్పూర్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముం దు బోట్యానాయక్ తండాలో బీఆర్ఎస్ జెండాను ఆయన ఆవిష్కరించారు. మోదీపూర్, జమాల్పూర్లో ప్రతిష్ఠ పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో నవోదయ చైర్మన్ రవీందర్రెడ్డి, ఎంపీపీ శశికళ, జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంసీసీ కృష్ణయ్యయాదవ్, రైతుబం ధు సమితి కన్వీనర్ మల్లయ్య, నాయకులు శ్రీనివాస్రెడ్డి, భీంరెడ్డి, రవి పాల్గొన్నారు.