దామరగిద్ద, అక్టోబర్ 11 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేశామని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపా రు. మండలంలోని దామరగిద్ద, మద్దెలబీడు, దా మరగిద్దతండా, బాపన్పల్లి, క్యాతన్పల్లి, ముస్తాపేట, దేశాయిపల్లి, అయ్యవారిపల్లి, చాకలివారిపల్లి, ఎల్సాన్పల్లి గ్రామాల్లో బుధవారం బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎల్సాన్పల్లి గ్రామంలో ఎమ్మెల్యే సమక్షంలో వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఆదరించాలని కోరారు. సమైక్య పాలకులు గ్రామాల అభివృద్ధిని విస్మరించారని, సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు. డెవలప్మెంట్ను చూసి బీఆర్ఎస్లో చేరుతున్న వారందరూ సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలన్నారు. మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ నిర్వాసితులకు ఇండ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించి ఇండ్లు కోల్పోయిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అశోక్గౌడ్, మండలాధ్యక్షుడు ఆశన్న, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.