కందనూలు, ఆగస్టు 25: శ్రావణమాసాన్ని పురసరించుకుని జిల్లా కేంద్రంలో ని వివిధ ఆలయాల్లో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వరలక్ష్మీ అమ్మవారికి అ ష్టోత్తర కుంకుమార్చన, నైవేద్యం చెల్లించి మహామంగళ హారతులు ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలోని శీమద్విరాట్ పోతులూరి గోవిందమాంబ సమే త వీరబ్రహ్మేంద్రస్వామి, కొల్లాపూర్ చౌర స్తా వద్ద ఉన్న జ్ఞాన సరస్వతి, హౌసింగ్బోర్డ్లోని ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి, శ్రీ భగవాన్ సత్యసాయి బాబా ఆలయాల్లో భక్తులు పూజలు చేశారు.
బిజినేపల్లిలో..
బిజినేపల్లి ఆగస్టు 25: మండలంలోని పాలెం అలివేలుమంగ సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్దఎత్తున ఆలయానికి చేరుకొని అమ్మవారికి పూజలు చేశారు. మహిళలందరూ ఒకేచోట సామూహిక వరలక్ష్మి వ్రతలను నిర్వహించారు. అ నంతరం వేంకటేశ్వర స్వామికి అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు జయంత్కుమార్, శుక్లాచార్య పాల్గొన్నారు.
తిమ్మాజిపేటలో..
తిమ్మాజిపేట, ఆగస్టు 25 : మండల కేంద్రంతోపాటు, పలు గ్రామాల్లో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు మహిళలు భక్తిశ్రద్ధ్దలతో నిర్వహించారు. శ్రావణమాసం పౌ ర్ణమికి ముందు వచ్చే శుక్రవారం సందర్భంగా మహిళలు సౌభాగ్యాన్ని, కుటుంబా న్ని కాపాడాలని, సిరిసంపదలను ఇవ్వాల ని వ్రతాలను ఆచరించారు.
తెలకపల్లిలో..
తెలకపల్లి, ఆగస్టు 25 : మండల కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించారు. శ్రావణమాసంలోని రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని చేయించడం అనాదిగా వస్తున్నదని పూజారులు తెలిపారు.