తిమ్మాజిపేట: మహోన్నతుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడంతోనే భాద్యత తీరదని, వారు ఆలోచనను,సూచించిన మార్గాన్ని అనుసరించాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తిమ్మాజిపేట మండలం బుద్దసముద్రం గ్రామంలో స్థానిక యువకులు ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశాంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గోప్ప వ్యక్తు ల విగ్రహాల ఏర్పాటు వలన గ్రామాలలో చైతన్యం వెల్లివిస్తుందన్నారు. జయంతులు, వర్దంతుల నిర్వహించడం కాద ని, వారి గురించి నేటి తరానికి తెలియజేయా లన్నారు. గాంధి,అంబేద్కర్, వివేకానంద,శివాజిల సిద్దాంతాలను మన జీవితంలో ఒక్కటన్న అచరించాలన్నారు.
బుద్దసముద్రం గ్రామంలో చైతన్యవంతమైన యువత ఉందని,గతంలో మధ్యపాన నిషేదం లాంటి కార్యక్రమాలను నిర్వహిం చిన విషయం గుర్తు చేశారు. గ్రామ సర్పంచ్ రాణేమ్మ గ్రామ అభివృద్ధి కోసం కోన్ని అవసరాలను ఎమ్మెల్యే దృష్టికి తేగా ఆయ న సానుకూలంగా స్పందించారు.
కార్యక్రమంలో ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి, జడ్పీటీసీ దయాకర్రెడ్డి, వైస్ఎంపీపీ శ్రీనివాస్యాదవ్, సర్పంచ్ వేణుగోపాల్ గౌడ్, ఎంపీటీసీ బాలయ్య,పార్టీ మండలాధ్యక్షుడు జోగు ప్రదీప్, కార్యదర్శి జైపాల్ రెడ్డి, విండో వైస్ చైర్మన్ రాందేవ్రెడ్డి, స్వామి, నాయకులు చంద్రశేఖర్రావు, బాలరాజు, ప్రసాద్, ఈశ్వర్, బోందిలయ్య, శ్రీను, మోహన్ పాల్గొన్నారు.