నాగర్కర్నూల్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ అభయారణ్యానికి ప్రత్యేక చరిత్ర ఉంది. దాదాపు 2,611 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న దట్టమైన నల్లమల అటవీప్రాం తం ఎన్నో ప్రకృతి అందాలు, వన్యప్రాణులకు నెలవు. శ్రీశైలం, మల్లెలతీర్థం, భౌరాపూర్, అక్కమహాదేవి గుహ, ఉమామహేశ్వరం, మద్దిమడుగులాంటి ఆధ్యాత్మి క ప్రదేశాలతోపాటు.. శ్రీశైలం ప్రాజెక్టు, జూరాల నుంచి నల్లమలకు వడ్డాణంలా ప్రవహించే కృష్ణమ్మ ప్రత్యేకత ఈ అడవి సొంతం. 1983నుంచి ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్ టైగర్ అభయారణ్యంగా ఉన్న ఈ అడవి తెలంగాణ ఏర్పాటుతో అమ్రాబాద్ అభయారణ్యంగా మా రింది. నల్లమల పెద్దపులులకు ప్రత్యేకంగా నిలుస్తోంది. పెద్దపులుల రక్షణకు ఏపీతో కలిపి జాయింట్ రివర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. 2018లో కేంద్ర అటవీశాఖ అంచనా మేరకు 17 పెద్దపులులు ఉన్నట్లు గుర్తించగా.. 2022లో 23 వరకు చేరాయి. అయితే 30వరకు పెద్దపులులు ఉండే అవకాశం ఉన్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఈ అటవీ ప్రాంతం పెద్దపులులకు సేఫ్ జోన్గా మారింది. క్రమేణా పెద్దపులుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారి రోహిత్ సఫారీయాత్రను ఏర్పాటు చేశారు. గతేడాది నుంచి ఇది విజయవంతంగా సాగుతూ వస్తున్నది. దీంతో హైదరాబాద్ నుంచి పర్యాటకుల సం ఖ్య పెరుగుతున్నది. దీనిని దృష్టిలో ఉంచుకొని గతంలో ఉన్న వాహనాలకు తోడు గా కొత్తగా 8 సఫారీ వాహనాలను సమకూర్చారు. అదే విధంగా పర్యాటకుల కోసం 6 కొత్త కాటేజీలను సైతం ఏర్పాటు చేశారు. దూర ప్రాంత పర్యాటకులు రాత్రివేళ ఈ కాటేజీల్లో బస చేసి ప్రత్యేక అనుభూతిని పొందవచ్చు. ఈ సఫారీ టూర్ కోసం ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా అటవీ ప్రాంతం వివరాలను ప్రజలందరికీ తెలిసేలా ఏటీఆర్ పేరిట ప్రత్యేక వెబ్సైట్ను ఏర్పాటు చేశారు.
ఈ అభయారణ్యంలో ఉన్న పెద్దపులులు, చిరుతలు, కణితి, మన్నువోతు, అడవిపందులు, చుక్కల దుప్పులు, ఎలుగుబం ట్లు, కుందేళ్లు, జింకలు, నక్కలు, ఆంబోతులతోపాటు 200 రకాల పక్షులు, క్షీరదాలు, వందరకాల సీతాకోక చిలుకలు, 50రకాల క్రిములు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన పెద్దపులులు, చిరుతలు తదితర వన్యప్రాణ వివరాలు, చెట్లు, పక్షులు వివరాలు ఫొటోలతోపాటు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. దీనివల్ల అడవి ప్రాముఖ్యత, విశేషాలు ప్రజలకు క్షణకాలంలోనే తెలుస్తాయి. ఈ వెబ్సైట్తోపాటు పుస్తకాలనూ ముద్రించారు. వెబ్సైట్తోపాటు పుస్తకాలు, సఫారీ వాహనాలు, కాటేజీలను శుక్రవారం ప్రారంభించేందుకుగానూ మం త్రి ఇంద్రకరణ్రెడ్డి గురువారం రాత్రి మన్ననూర్కు చేరుకున్నారు.
అడవి రక్షణ అందరి బాధ్యత
అమ్రాబాద్ అభయార ణ్యం ప్రకృతి సంపద. ఇలాంటి అడవిని, జంతువులు, పక్షులు, సరిసృపాల్లాంటి ప్రాణులను రక్షించుకోవడం అందరి బాధ్యత. అడవి గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం చాలా ఉంది. అడవి ప్రాముఖ్యతను వివరించడంతోపాటు ఇక్కడి విశేషాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సఫారీ టూర్ ఏర్పాటు చేశాం. మారిన కాలంతోపాటు అడవి వివరాలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏటీఆర్ పేరిట వెబ్సైట్ ఏర్పాటు చేశాం. ఈ వెబ్సైట్తోపాటు పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన కాటేజీలు, సఫారీ వాహనాలను శుక్రవారం అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభిస్తారు.
– రోహిత్ గోపిడి, డీఎఫ్వో