పాలమూరు, డిసెంబర్ 20 : పిల్లలమర్రి బాలోత్సవం ఆకట్టుకున్నది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్లో పిల్లలమర్రి బాలోత్సవ్ కమిటీ అధ్యక్షుడు బెక్కెం జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు మట్టిలో మణిక్యాలని అన్నారు. తల్లిదండ్రులు చిన్నారుల మనోభావాలను అర్థం చేసుకొని చదువుతోపాటు ఆటపాటల్లోనూ ప్రోత్సహించాలన్నారు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు బుధవారం బహుమతులు పంపిణీ చేయనున్నట్లు తెలిపా రు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వివిధ రకాల వేషధారణలు, ఆటపాటలు, బతుకమ్మలు, వ్యాసరచన పోటీల్లో పాలుపంచుకున్నారు. కమిటీ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, బాలోత్సవ్ కమిటీ ప్రధాన కార్యద ర్శి డా.ప్రతిభ, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డా.రాంకిష న్, డా.మధుసూదన్రెడ్డి, వెంకటేశ్వరశర్మ, డా.మహేశ్, వీణ, శి వకుమార్, డా.రామ్మోహన్, డా.రాఘవేందర్, సీనియర్ సిటిజ న్ ఫోరం అధ్యక్షుడు సురభిజగపతిరావు, ప్రైవేట్ పాఠశాలల సం ఘం అధ్యక్షుడు ప్రభాకర్, నిర్వాహకుడు వీరాంజనేయులు ఉన్నారు.