నాగర్కర్నూల్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : పదో విడుత రైతుబంధు డ బ్బులు జమచేసేందుకు వ్యవసాయ శాఖ చ ర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎకరాకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందించే లా ఏర్పాట్లు చేస్తున్నది. 2018 మే 10 నుంచి ఈ పథకం రూ.4వేలతో ప్రారంభమైంది. రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ.8వేల చొప్పున నే రుగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. కాగా, పెరిగి న ధరలను గుర్తించిన సీఎం కేసీఆర్ 2019-20 నుంచి ఎకరాకు రూ.వెయ్యి చొప్పున పెంచడం వి శేషం. ఇలా ఏటా రెండు పంటలకు రూ.10వేల ఆర్థిక సా యం అందిస్తున్నది. దీంతో రైతులు విత్తనాలు, ఎరువుల పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులు, దళారులను ఆశ్రయించడం తగ్గింది. ఈ పథకాన్ని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించింది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కాని బృహత్తర పథకాన్ని సీఎం కేసీఆర్ అమలుచేస్తూ రైతులపై తనకున్న ఉదారతను చాటుకుంటున్నారు.
దీంతోపాటు 24 గంటల ఉచిత కరెంట్, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి చెరువులు, కుంటలను నింపి, కాల్వల ద్వారా పంటలకు సాగునీరు అందిస్తున్నారు. అలాగే రైతుబీమా, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందించడం, పంటలకు మద్ద తు ధర కల్పించడం, కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నది. ఇలా రైతులు పంటలు పండించడం నుంచి కొనే వరకూ రాష్ట్ర ప్రభుత్వం ముందుండి ప్రోత్సహిస్తున్న ది. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న రైతుబంధు, ఇతర పథకాలతో గ్రామాల్లో బీడుబడ్డ భూములు పచ్చగా మారాయి. వరి, వేరుశనగ, పత్తి, పప్పు, నూనె గింజల సాగుతో ఊ ళ్లోనే వ్యవసాయ పనులు దొరుకుతున్నాయి. ఫలితంగా రైతు కూలీలు, పేదల వలసలు తగ్గాయి. కాగా, కేంద్రం ధా న్యం సేకరణకు నిరాకరిస్తున్నా.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కొనుగోలు చేస్తుండడం గమనార్హం.
ఇలా రైతులపై సీఎం కేసీఆర్కు ఆదరణ పెరుగుతున్నది. దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజేపీలు రైతుబంధు, ఇతర పథకాలపై చేస్తున్నా రైతుపక్షపాతిగా సీఎం ఆదేశాలు జారీ చే యడంతో ఈ నెల 28 నుంచి రైతుబంధు డబ్బులు ఖాతా ల్లో జమ కానున్నాయి. 28వ తేదీన ఎకరం రైతులకు తొలు త ప్రాధాన్యత ఇస్తూ.. గతం మాదిరిగానే ఎకరాకు రూ.5 వేల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ కానున్నా యి. నాగర్కర్నూల్ జిల్లాలో 2018 నుంచి ఈ ఏడాది వా నకాలం వరకు రూ.2,880 కోట్లను 20 లక్షల మందికిపైగా రైతులకు అందించడం విశేషం. ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనా ఏటా ఎకరాకు రూ.10వేల చొప్పున మంజూ రు చేస్తుండడం గొప్ప విషయం.
28 నుంచి ఖాతాల్లో జమ..
రైతుబంధు పథకంతో పెట్టుబడుల కష్టాలు తీరాయి. 2018 నుంచి ఈ ఏడాది వానకాలం నాటికి జిల్లాలో 20 లక్షల మంది రైతులకు రూ.2,800 కోట్లను అందించాం. ఈ ఏడాది యాసంగిలో 2.95 లక్షల మందికి అదనంగా మరో రూ.5కోట్ల వరకు సాయం అందే అవకాశం ఉన్నది. ఇప్పటికే ప్రభుత్వానికి రైతుల వివరాలను నివేదించాం. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈనెల 28 నుంచి రైతుబందు డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నాం.
– వెంకటేశ్వర్లు, డీఏవో, నాగర్కర్నూల్