నాగర్కర్నూల్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగా ణ) : దవాఖానల్లో మరిన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. గ్రామీణ స్థా యిలో పేదలకు వైద్యం అందించడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కీలకం. వాటికి కొన్నేళ్లుగా మరమ్మతులు చేయలేదు. చాలా పీహెచ్సీలకు సొంత భవనాలున్నా మరమ్మతులు లేకపోవడంతో రోగు లు, వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు. ము ఖ్యంగా వర్షాకాలంలో భవనాలు కురుస్తుండడం తో కొన్ని పీహెచ్సీల్లో నిర్వహణ కష్టంగా మారిం ది. ఫ్లోరింగ్, టాయ్లెట్లు, విద్యుత్, రూఫ్, ప్రహరీ వంటి ఏర్పాట్లకు, రంగులు వేయడం వంటి పను ల కోసం వైద్యులు, సిబ్బంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వైద్యారోగ్య శాఖ జిల్లా అధికారులు ఈ సమస్యలపై తగిన అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపారు. దీంతో స్పందించిన ప్రభుత్వం ఇటీవలే పీహెచ్సీల వారీగా వచ్చిన అంచనాల ప్రకారం.. నిధులను మంజూరు చేసింది. ఇలా ఉమ్మడి మహబూబ్నగర్లో 43 పీహెచ్సీలకు రూ.10కోట్లకుపైగా నిధులు విడుదలయ్యాయి.
నాగర్కర్నూల్ జిల్లాలో 13 పీహెచ్సీలు ఉండగా.. రూ.2.53 కోట్లు, మహబూబ్నగర్లో 4 పీహెచ్సీలకు రూ.1.12 కోట్లు, వనపర్తిలో 13 పీహెచ్సీలకు రూ.2.11 కోట్లు, జోగుళాంబ గద్వాలలో 6 పీహెచ్సీలకు రూ.1.23 కోట్లు, నారాయణపేటలో 7 పీహెచ్సీలకు రూ.1.55 కోట్లు, తెలకపల్లి పీహెచ్సీకి రూ.1.56 కోట్లు.. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44 పీహెచ్సీలకు రూ.10 కోట్లు మంజూరయ్యాయి. తెలకపల్లి పీహెచ్సీకి నూతన భవనం నిర్మించనున్నారు. పీహెచ్సీల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులతో దవాఖానల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేయడం, ఎలక్ట్రీషియన్ పనులు, టాయ్లెట్లు, చెత్తు నుంచి నీళ్లు కారడం, ఫ్లోర్లు సరిచేయడం వంటి పనులను చేపట్టనునారు. తెలకపల్లి పీహెచ్సీకి నూతన భవనం నిర్మిస్తుండగా.. చారకొండ, పెద్దూరు, బొప్పల్లి, తాడూరు, వటవర్లపల్లి, లట్టుపల్లి, తిమ్మాజిపేట, పదర, మన్ననూర్, లింగాల, పాలెం, వంగూరు, వెల్దండ పీహెచ్సీలకు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులకు పీఆర్ శాఖ ద్వారా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఈ నెలలో ఎస్టిమేషన్లను పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వర్షాలు కురుస్తుండడంతో రూఫ్ లీకేజీ పనులతోపాటు విద్యుత్, టాయ్లెట్లు, ఫ్యాన్ల ఏర్పాటు వంటి పనులకు వైద్యులు ప్రాధాన్యత ఇస్తున్నారు.
త్వరలో అంచనాలు రూపొందిస్తాం..
నాగర్కర్నూల్ జిల్లాలోని 13 పీహెచ్సీల మరమ్మతులకు ప్రభుత్వం రూ. 2.53 కోట్లను మంజూరు చేసింది. తెలకపల్లిలో కొత్త భవనానికి అదనంగా రూ.1.56 కోట్లను విడుదల చేసింది. ఈ పనులకు త్వరలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఎస్టిమేషన్లు తయారు చేయిస్తాం. సాధ్యమైనంత త్వరగా పీహెచ్సీల్లో చిన్నచిన్న మరమ్మతులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– సుధాకర్లాల్, డీఎంహెచ్వో, నాగర్కర్నూల్