కొల్లాపూర్ రూరల్, జూన్ 3 : పల్లెప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేసి గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ఆర్డీవో హనుమానాయక్ ప్రజాప్రతినిధులను, అధికారులకు సూచించారు. శుక్రవారం కొల్లాపూర్ మండలం సింగోటంలో రైతువేదిక భవనంలో అధికారులు ప్రజాప్రతినిధులతో పల్లెప్రగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న క్రీడామైదానాన్ని పరిశీలించారు. గత నాలుగు విడుతలుగా గ్రామంలో చేసిన పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఐదో విడుతలో జరగాల్సిన ప్రగతి పనులపై కూడా ఆర్డీవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయనున్న క్రీడామైదానాలను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆర్డీవో ఆదేశించారు.
గ్రామాల్లో పచ్చదనం.. పరిశుభ్రత ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతిఒక్కరూ భాగస్వాములుగా ఉండి తమ గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని మున్సిపల్ వార్డుల్లో ప్రగతి పనులు మొదలు పెట్టేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం పట్టణంలోని 3, 11వ వార్డుల్లో కంపచెట్లు తొలగింపు కార్యక్రమానికి కౌన్సిలర్లు శ్రీకారం చుట్టారు. 3వ వార్డులో కౌన్సిలర్ బాలస్వామి, 11వ వార్డులో కరుణ మహేశ్ పనులను ప్రారంభించారు. అలాగే మండలంలోని మాచినేనిపల్లిలో సర్పంచ్ సుజాత ఆధ్వర్యంలో వార్డు సభ్యులు పల్లెప్రగతిపై ర్యాలీ నిర్వహించారు. మొలచింతపల్లిలో సర్పంచ్ కొమ్మరాజు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, ఎంపీడీవో నర్సింహులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పల్లెప్రగతితో అభివృద్ధి
గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఎంపీపీ అరుణ, జెడ్పీటీసీ లక్ష్మి అన్నారు. శుక్రవారం వారు గ్రామాల్లో ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్ని జీపీల సర్పంచులు, ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు ప్రజలతో కలిసి వారు గ్రామాల్లో పర్యటించారు. మురుగుకాలువలు, రోడ్లను పరిశీలించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ కిష్ట్యానాయక్, ఎంపీడీవో దేవన్న, సర్పంచులు రవిచంద్రారెడ్డి, ప్రియాంక, గణేశ్, సువర్ణ, ఎను, శివశంకర్ ఉన్నారు.
ప్రగతి దిశగా ముందుకు సాగుదాం
ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి కొనసాగిస్తున్న ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రగతి దిశగా ముందుకు సాగుదామని ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు ప్రజలకు సూచించారు. మండల కేంద్రమైన కోడేరు, బాడుగదిన్నె, మాచుపల్లి, జనుంపల్లి గ్రామాల్లో శుక్రవారం పల్లెప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అధికారులు అన్ని వర్గాల ప్రజలను ఈ కార్యక్రమంలో మమేకం చేసి గ్రామాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. పల్లెప్రగతిలో గుర్తించిన అన్ని పనులను పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రావణ్కుమార్, సర్పంచులు వెంకటస్వామి, పూర్ణచంద్రారెడ్డి, కవిత, సువర్ణ, అధికారులు, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతి పనుల పరిశీలన
తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చే పట్టిన ఐదో విడుత పల్లెల ప్రగతి కార్యక్రమం అమ్రాబాద్, పద ర ఉమ్మడి మండలాల్లో శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో సర్పంచులు తిరిగి చేయాల్సిన పనులను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచులు శ్రీరామ్నాయక్, శారద, ప్రవీణ్, పెద్దిరాజు, గీత, అధికారులు పాల్గొన్నారు.
పెద్దకొత్తపల్లిలో..
ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమం మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో సర్పంచు లు, అధికారులు మొదటిరోజు గ్రామంలో పలు వార్డుల్లో పర్యటించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు మురుగు కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా పారిశుధ్య పనులు చేపట్టారు. అనంతరం గ్రామసభ నిర్వహించి చేపట్టే రోజువారీ కార్యక్రమాలపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణ య్య, సర్పంచులు శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతితో సమస్యలు పరిష్కారం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పట్టణ ప్రగతితో వార్డుల్లో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 15, 16వ వార్డుల్లో పర్యటించారు. 4వ విడుత పట్టణ ప్రగతి వార్డు సమావేశాలు నిర్వహించారు. సమావేశంలో వార్డుల్లో నెలకొన్న సమస్యలు, పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. 20వ వార్డుల్లో వార్డు ప్రత్యేధికారులు పర్యటించి సమస్యలు గుర్తించాలన్నారు. వార్డుల్లో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. 3వ వార్డులో కౌన్సిలర్ సోమ్లానాయక్ ఆధ్వర్యంలో వార్డు సమావేశం నిర్వహించి పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీహరిరాజు, కౌన్సిలర్లు రమేశ్రావు, సోమ్లానాయక్, మన్నుపటేల్ నాయకులు పర్వతాలు, ఉస్సేన్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
పెంట్లవెల్లిలో..
గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమం మండలంలోని కొండూరు, గోప్లాపురం, జటప్రోల్, మంచాలకట్ట, మల్లేశ్వరం, ఎంగంపల్లి, మాధవస్వామి నగర్, పెంట్లవెల్లి గ్రామాల్లో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. అభివృద్ధి పనులపై గ్రామ సభను నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
అందరూ భాగస్వాములు కావాలి
ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములై గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఎంపీపీ లింగమ్మ అన్నారు. శుక్రవారం మండలంలోని సూరాపూర్ గ్రామంలో ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. గ్రామాల్లో మురుగు కాలువలు, అంతర్గత రోడ్లు, విద్యుత్ తదితర కార్యక్రమాలు త్వరతగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా లింగాల, అంబట్పల్లి, అప్పాయిపల్లి తదితర గ్రామాల్లో పల్లెప్రగతిపై సమావేశం నిర్వహించి ప్రధాన విధుల గుండా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు రవిశంకర్, ఎంపీడీవో గీతాంజలి, తాసిల్దార్ సుధాకర్, మండల ప్రత్యేకాధికారులు నాగార్జునరెడ్డి, వెంకటేశ్వర్లు, సర్పంచులు కోనేటి తిరుపతయ్య, వైస్ చైర్మన్ వెంకటగిరి పాల్గొన్నారు.