నాగర్కర్నూల్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలనలో నాగర్కర్నూల్ ప్రాంతం వలసలకు మారుపేరుగా నిలిచింది. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టును ఆశగా చూపించి నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలకులు ఓట్లు దండుకుంటూ కాలం గడిపారు. 1984లో ప్రాజెక్టు రూపకల్పనపై చర్చ జరిగింది. నాటి టీడీపీ సర్కార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి విడిచిపెట్టింది. కాగా, 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడంతో 2002లో దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో రూ.1,766 కోట్ల అంచనాతో ప్రాజెక్టు పనులపై ఆశలు పెంచిది. 2014 నాటికి అం టే తెలంగాణ వచ్చే వరకు ఆ వ్యయం రూ.3,700 కోట్లకు చేరుకున్నది. ఇదిలా ఉంటే, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన నాటి సీఎం కిరణ్కుమార్రెడ్డి తెలంగాణ ఉద్యమం తీవ్రం కావడంతో 2012లో ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలో మొదటిదైన ఎల్లూరు రిజర్వాయర్(0.35 టీఎంసీల సామర్థ్యం)ను మాత్రమే ప్రారంభించారు.
అయితే, ప్రాజెక్టు ఆశించిన లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ హ యాంలో ప్రాజెక్టు ముఖచిత్రమే మారిపోయింది. కాంట్రాక్టర్లకు పెం డింగ్ బిల్లులు చెల్లించడంతోపాటు రూ.100 కోట్లు అడ్వాన్సు మొబిలైజేషన్ కింద మంజూరు చేసింది. దీంతో ఏడాదిన్నరలోనే ప్రాజెక్టు ప నులు పూర్తయ్యాయి. 2015-16లో జొన్నలబొగుడ రిజర్వాయర్ (2.14 టీఎంసీలు), గుడిపల్లి రిజర్వాయర్(0.96 టీఎంసీలు)ను పూర్తి చేసింది. ఇక కొల్లాపూర్ మండలంలోని సింగోటం చెరువును 0.55 టీఎంసీలతో రిజర్వాయర్గా మార్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నా టి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు రాత్రింబవళ్లు జొన్నలబొగుడ వద్ద నిద్రించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇలా ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టుకు సైతం నీరందేలా చేసిన ఘనత టీఆర్ఎస్ సర్కార్కే దక్కుతుంది. ప్రాజెక్టు పరిధిలో 3.40 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని నిర్దేశించగా దానిని 4.20 లక్షల ఎకరాలకు పెంచడంతోపాటు 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో జిల్లాలో గతేడాది 2.50 లక్షల ఎకరాలకు సాగునీరందడం విశేషం. జిల్లాగా మారిన నాలుగైదేండ్లలో దాదాపుగా 200 టీఎంసీలను చెరువులు, కుంటల్లో నింపుతూ బీడు భూములను పచ్చని మాగాణుల్లా మార్చారు. జిల్లాలో దాదాపు 500 పెద్ద చెరువులను నింపడంతో అదనంగా 50 వేల ఎకరాలకు సాగునీ రందుతున్నది. మిషన్ కాకతీయ కింద 1,567 చెరువులను పునరుద్ధరించారు. మత్స్యసంపద పెరిగింది. సాగు, తాగునీటి సమస్య తీరింది. గ్రామాలు, పట్టణాల్లో బోర్ పాయింట్ చూపించాల్సిన అవసరం లేకుండానే నీళ్లు పడుతున్నాయి. ఇంతకుముందు వెయ్యి ఫీట్లు డ్రిల్లింగ్ చేసి నా నీళ్లు పడని ప్రాంతాల్లో 200 ఫీట్లకే కృష్ణమ్మ ఉబికివస్తున్నది. ఎప్పు డో సంతల్లో మాత్రమే కనిపించే చేపలు ఇప్పుడు రోజూ ఇంటి ఆహారంగా మారాయి. పశుగ్రాస సమస్య తీరింది. వర్షాకాలంతో సంబంధం లేకుండా వేసవి కాలంలోనూ చెరువులు మత్తడి దూకుతున్నాయి. 24 గంటలూ నీళ్లు, విద్యుత్ ఉచితంగా వస్తుండడంతో సేద్యం సంబురంగా సాగుతున్నది. వరి, వేరుశనగ సాగు గణనీయంగా పెరిగింది. వలస వెళ్లిన పేదలు స్వగ్రామాలకు చేరుకొని హాయిగా జీవిస్తున్నారు.
సాధారణానికి మించి సాగు..
2021 వానకాలంలో జిల్లాలో 5.41 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. యాసంగిలో 1.55 లక్షల ఎకరాల అంచనాకుగానూ 3.06 లక్షల ఎ కరాల్లో సాగైంది. ప్రాజెక్టు పూర్తికాక ముందు 2016-17 సంవత్సరం వానకాలంలో సాధార ణ విస్తీర్ణం 1,98,106 హెక్టార్లు కాగా, 2, 23,934 హెక్టార్ల పంట సాగైంది. యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం 39,453 హెక్టార్లకుగా నూ 54 వేల హెక్టార్లకే పరిమితమైంది. ఇప్పుడు ఆ పంటలు రెట్టింపు స్థాయిలో పెరగడం గమనా ర్హం. భూముల ధరలు పదింతలయ్యాయి. గ తంలో ఎకరా రూ.లక్ష కూడా పలకని చోట నేడు దాదాపుగా రూ.25 లక్షలు పలుకుతున్నది. సా మాన్యులను కుబేరుల్లా చేస్తున్నాయి. గ్రామాల్లో గుడిసెలు మాయమయ్యాయి. పల్లెల్లో మేడలను తలపించేలా ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నా యి. వ్యవసాయక్షేత్రాల వద్ద ఫాంహౌస్లు వెలుస్తున్నాయి. దీనంతటికీ మూలం ఒక్క మహాత్మాగాంధీ కల్వకుర్తి ప్రాజెక్టే కావడం అక్షరాలా ని జం. ‘1984లో ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగాక నీళ్లు వస్తాయా.. కనీసం కృష్ణానది చెంతనే ఉన్న కొల్లాపూర్కు చుక్క నీరైనా వస్తుందా’ అని సందేహాలున్న సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏ ర్పాటు కావడంతో ప్రాజెక్టు స్వరూపం మారిపోయింది.
ప్రాజెక్టు కోసం గతంలో ఎన్నో ఉద్యమాలు చేసినా.. నాటి పాలకులు పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు. సీఎం కేసీఆర్ వల్ల కందనూలుకు ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టుతో కృష్ణానది తరలివచ్చింది. ఇలా టీఆర్ఎస్ సర్కార్లో పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్గా మారాయన్నది బహిరంగ సత్యం. దీంతో స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్ఎస్కే ప ట్టం కడుతున్నారు. దీనికితోడు రైతు సంక్షేమం, ఇతర పథకాలతో జిల్లాలో టీఆర్ఎస్ తిరుగులేని పార్టీగా అవతరించింది. టీడీపీ, కాంగ్రెస్లు తుడిచిపెట్టుకుపోయాయి. అయితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ఉద్యమం, అభివృద్ధిలో ప్రేక్షకపాత్రకే పరిమితయ్యాడు. ఇప్పు డు కపటబుద్ధితో చేపట్టిన పాదయాత్రను రైతు లు, ప్రజలు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ‘తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బండి.. ఏ మొహం పెట్టుకొని పాదయాత్ర చేపడుతున్నా వ్’ అంటూ ప్రజలు నిలదీస్తున్నారు.
కొత్త రిజర్వాయర్లకు ప్రతిపాదనలు..
ఎంజీకేఎల్ఐ పరిధిలో కొత్తగా బిజినేపల్లి మండలం లట్టుపల్లి వద్ద మార్కండేయ రిజర్వాయర్ నిర్మించనున్నారు. దీనికి దాదాపుగా రూ.100 కోట్ల వరకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందది. 20 వేల ఎకరాలకు సాగునీరందించేలా చర్యలు చేపడుతున్నారు. అలాగే, నల్లమల అడవుల్లో ఎత్తైన ప్రాంతంలో ఉన్న అమ్రాబాద్, పదర, మన్ననూర్, బల్మూర్కు సాగునీరందించేందుకు ఉమామహేశ్వర, మార్కండేయ రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అచ్చంపేట, ఉప్పునుంతల మండలాల్లో 15 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు పుల్జాల నుంచి చంద్రసాగర్ చెరువు వరకు 15 కిలోమీటర్ల బ్రాంచ్ కెనాల్ నిర్మాణాలకు రూ.107.20 కోట్లను విడుదల చేసి పరిపాలన అనుమతులు మంజూరు చేయడం గమనార్హం. అచ్చంపేట, బల్మూర్ మండలాల్లోని 70 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఐదు టీఎంసీలతో కూడిన ఉమామహేశ్వరం, చెన్నకేశవ రిజర్వాయర్ల నిర్మాణ సర్వే పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ రిజర్వాయర్ల శంకుస్థాపనకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ఆధారంగా దుందుభీ వాగు వద్ద సిర్సవాడ, పాపగల్, మేడిపూర్, ఉల్పరవంటి పలుచోట్ల చెక్డ్యాంల నిర్మాణంతో సమీప ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగాయి.
బీజేపీ, కాంగ్రెస్ చేసిందేమీ లేదు..
రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు ప్రజలకు చేసిందేమీ లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్రతో రైతులకు ఏమీ ఒరగదు. గతంలో కాంగ్రెస్ను గెలిపిస్తే పొలాలకు సాగునీరు ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకనే కాలువల్లో నీళ్లు పారుతున్నయ్. చెరువులు అలుగెళ్లుతున్నయ్. సంబురంగా పంటలు పండించుకుంటున్నాం. ఎంతో సంతోషంగా ఉన్నాం. సీఎం కేసీఆర్ సార్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
– నల్లవెల్లి వెంకటస్వామి, రైతు, కోడేరు
టీఆర్ఎస్ హయాంలోనే సాగునీరు..
కేసీఆర్ సీఎం అయ్యాక ఎంజీకేఎల్ఐ ద్వారా నీళ్లు వచ్చాయి. టీడీపీ హయాంలో శంకుస్థాపన చేసి వదిలేశారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయలేదు. పనులను పూర్తి చేసేందుకు 16 గడువులను పెట్టింది. అయినా అసంపూర్తిగానే వదిలేశారు. ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ నిధులను కేటాయించడంతోపాటు ప్రాజెక్టుల వద్ద మంత్రులు నిద్ర చేసి నీళ్లు అందించారు. ఇప్పుడు రెండు కార్ల పంటలు పడుతున్నాయి. సీఎం కేసీఆర్ పుణ్యాన ప్రతి రైతూ హాయిగా బతుకుతున్నాడు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.
– శ్రీనివాస్రెడ్డి, రైతు, ఎత్తం, కోడేరు మండలం