హన్వాడ, ఏప్రిల్ 18 : వైద్యసేవలు విస్తరించడం కోసం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ భవనం కూల్చి రూ.3 కోట్లతో కొత్త దవాఖానను నిర్మిస్తామని మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో మెగా వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మన ఆరోగ్యాన్ని కాపాడుకొనే అవకాశం మన చేతుల్లోనే ఉందని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వదవాఖానల్లో వై ద్యసేవలు అందుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లే ని విధంగా ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు చేసుకుంటే కేసీఆర్ కిట్తో పాటు రూ.12వేలు అందించడం జరుగుతుందన్నారు. గతం కంటే ప్రభుత్వ దవాఖాన ల్లో ఇప్పుడు కాన్పులసంఖ్య పెరిగిందని, ప్రజలకు ప్ర భు త్వ దవాఖానలపై నమ్మకం కలిగిందని మంత్రి వివరించా రు.
ఈ శిబిరంలో నాలుగు వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు. అలాగే ఈ సందర్భంగా 150మంది యువకులు రక్తదానం చేయగా మంత్రి వారికి సర్టిఫికెట్లు అం దజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్, డీఎంహెచ్వో కృష్ణ, ఎం పీపీ బాలరాజు, డాక్టర్ ప్రీతి, జెడ్పీటీసీ విజయనిర్మల, వైస్ ఎంపీపీ లక్ష్మి, సర్పంచ్ రేవతి, ఎం పీడీవో ధనుంజయగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్గౌడ్, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, రైతుబంధు మండల అధ్యక్షుడు రాజుయాదవ్, నాయకులు కొండ లక్ష్మయ్య, జంబులయ్య, బాలయ్య, రమణారెడ్డి, నరేందర్, సుధాకర్రెడ్డి, సత్యం పాల్గొన్నారు.
దళితులు ధనికులు కావాలి
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని దళితులు ధనికులుగా అభివృద్ధి చేందాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం హన్వాడలో దళితబంధు పథకం ద్వారా మంజూరైన బొలెరోను మంత్రి లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు దళితులను పట్టించుకోకపోవడంతో వారు అన్నింటా వెనుకబడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకొని వదిలేశారన్నారు. సీఎం కేసీఆర్ దళితులను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని మంత్రి వివరించారు. మండలంలో మొదటి విడుతలో 35 మందికి దళితబంధు మంజూరైందని, రెండో విడుత లో ప్రతి ఒక్కరికీ అందజేస్తామని మంత్రి హామీ ఇ చ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్ నం దాలాల్ పవార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, ఎంపీటీసీ అరుణ్, తెలంగాణ ఎంఆర్పీఎస్ జాతీ య కార్యదర్శి జంబులయ్య, నాయకులు సత్యం, యా దయ్య, కొండ బాలయ్య, అనంద్, వాసు, కొండలక్ష్మ య్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
కడుపునింపే జిల్లా పాలమూరు
మన జిల్లా కరువు జిల్లా కాదని.. ఇకపై అందరి కడుపు నింపే జిల్లాగా పేరు రా నుందని రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో శ్రీ రాంనగర్కాలనీలోని అభయాంజనేయస్వామి ఆలయంలో రూ.10లక్షలతో నిర్మించనున్న మండపానికి, జ్ఞానసరస్వతీ ఆలయంలో రూ.5లక్షలతో నిర్మించనున్న మండప నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆలయాల్లో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకట య్య, శ్రీనివాసులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.