43 కి.మీ. టన్నెల్కు గానూ 33 కి.మీ. పూర్తి
అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 10 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చివరి ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలనే ల క్ష్యంతో అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లి సమీపంలో ఎస్ఎల్బీసీ సొరంగ మా ర్గం ప్రాజెక్టు పనులు చేపట్టారు. కాగా ఈ ని ర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నా యి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 30 టీఎంసీలు తరలించి నల్లగొండ జిల్లాలోని మూడున్నర ల క్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో ప్రాజెక్టు ఏర్పాటుకు రూపకల్పన చేశా రు.
2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జ లయజ్ఞం పథకం ద్వారా 2005-2006 రాష్ట్ర బడ్జెట్లో రూ.2,813 కోట్లు కేటాయించి జ యప్రకాశ్ అసోసియేషన్ కంపెనీకి నిర్మాణ బాధ్యతలను అప్పగించింది. ఆసియాలోనే అ తి పెద్దదైన సొరంగ మార్గం పనులను 2008 లో అధికారికంగా ప్రారంభించారు. శ్రీశైలం డ్యాంకు ఎగువన నాలుగు కిలోమీటర్ల దూరం లో ప్రధాన రెగ్యులేటరీ నిర్మాణం, అక్కడి నుం చి 43.931 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం తవ్వేందుకు నేటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు దోమలపెంట (శ్రీశై లం డ్యాం) వైపు నుంచి 19 కి.మీ. (ఇన్లె ట్), మన్నెవారిపల్లి వైపు నుంచి 14.35 కి.మీ. (ఔట్లెట్).. మొత్తం 33.35 కి.మీ. ప నులు పూర్తయ్యాయి. ఇంకా 10.5 కి.మీ. మే ర పనులు చేపట్టాల్సి ఉన్నది.
అదే సమయం లో మన్నెవారిపల్లి సమీపంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మిస్తున్న డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నక్కలగండి ప్రా జెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కంపెనీ ఒప్పందం ప్రకారం 2010 ఆగస్టు వరకే పనులు పూర్తి కావాల్సి ఉంది. అయినా, గత ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి సరిపోయిన బడ్జెట్ కేటాయించకపోవడంతో పనులు నత్తనడకన సాగాయి. ఎస్ఎల్బీసీ సొరంగమార్గం పనుల్లో భారీ యంత్రాలు మరమ్మతులకు గురి కావడంతో ఏండ్ల తరబడి పనులు నిలిచిపోయిన సంఘటనలూ ఉన్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులను 2016లో నాటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సందర్శించి పనుల వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులను సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత కంపెనీ ప్రతినిధులను కోరారు. అయినప్పటికీ ప్రాజెక్టు పనుల్లో కంపెనీ ప్రతినిధులు అలసత్వం వీడడం లేదు. ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని రైతులు, ఫ్లోరైడ్ పీడిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.