అచ్చంపేట రూరల్ : స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కోరారు. అచ్చంపేట మండలం కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం హాజపూర్ చౌరస్తా ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కాంగ్రెస్ సైనికులు పెద్ద ఎత్తున ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ప్రజా పాలన ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క వ్యక్తికి అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిరంతరంగా ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని.. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డులు పెన్షన్లు , రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహాలక్ష్మీ, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం తదితర సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని.. వాటిని కార్యకర్తలు, అభిమానులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.