నాగర్కర్నూల్, డిసెంబర్ 21: ఆడబిడ్డలు ఇంటికి భారం కాకూడదనే ఉద్దేశంతో వారికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. అందుకోసమే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. జిల్లాకేంద్రంలోని సాయిగార్డెన్స్లో నియోజకవర్గంలోని 154మంది లబ్ధిదారులకు మంగళవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఏనాడూ ఆడబిడ్డ వివాహానికి సహాయం చేయలేదన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆత్మాభిమానంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. చెక్కుల పంపిణీ అనంతరం లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే సహపంక్తి భోజనం చేశారు. అనంతరం రూబీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రైస్తవులకు ప్రభుత్వం తరఫున దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరుపుకొన్నారు. కార్యక్రమాల్లో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్యాదవ్, సిం గిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కల్పనాభాస్కర్గౌడ్, వైస్ఎంపీపీ నిర్మల, పాస్టర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పాలెం గ్రామంలో బిజినేపల్లి-నాగర్కర్నూల్ వెళ్లే ప్రధాన రహదారిపై బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఎఫ్ నిధుల నుంచి రూ.కోటి వ్యయంతో బ్రిడ్జి పనులు చేపడుతున్నామని తెలిపారు. తరచూ వర్షంతో దెబ్బతిన్న ఈ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతుండడంతో బ్రిడ్జి మంజూరు చేయించామని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్గౌడ్, వైస్ఎంపీపీ చిన్నారెడ్డి, సర్పంచ్ లావణ్య, మాధవరెడ్డి, బాలస్వామి, రాజేందర్రెడ్డి, రామన్గౌడ్, శ్రీనివాసులు, తిరుపతయ్య, మహేశ్వర్రెడ్డి, శేఖర్, సత్యం, యాదవరెడ్డి, స్వామి తదితరులు ఉన్నారు.