సోమశిల వంతెన, హైవే నిర్మాణంపై అసెంబ్లీలో ప్రస్తావన
కొల్లాపూర్: చిరకాల స్వప్నం రెండు తెలుగు రాష్ర్టాలకు వారధి అయిన సోమశిల-సిద్దేశ్వరం వంతెన నిర్మాణం దశగా ప్రత్యే క చొరవ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్,రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి సోమవారం అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపారు.
వంతెన మంజూరు విషయంలో గత పాలకులు, పదవుల్లో ఉండి ఆ విషయాన్ని పట్టించుకోలేదని, మా నియోజకవర్గ ప్రజల తరుపున తాను విజ్ఞప్తి చేయగానే వెంటనే స్పందించి కేంద్రంతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్రెడ్డిలకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి ప్రకటించారు.
సోమశిల వంతెన త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి విజ్ఞప్తిచేస్తున్నట్లు ఎమ్మెల్యే బీరం తెలిపారు.కొల్లాపూర్ నియోజకవర్గంలో కౄష్ణానది బ్యాక్వాటర్ పైన పెంట్లవెల్లి మండలం జటప్రోలు వంతెన బాగా దెబ్బతిన్నదని, నాగర్ కర్నూల్-వనపర్తి రెండు జిల్లాల మధ్య రాకపోకలకు కీలకమైందని ఎమ్మె ల్యే పేర్కోన్నారు. నియోజకవర్గ కేంద్రానికి ప్రజలు వచ్చి వెళ్లేందుకు జటప్రోల్ వంతెన ఎంతో కీలకమైందని, జటప్రోలు పుణ్యక్షేత్రంలో చారిత్రక ఆలయ సముదాయాలు ఉన్నాయన్నారు. ఇక్కడికి భక్తులు, పర్యాటకులు రావ డానికి వంతెన చాలా అవసరమని ఎమ్మెల్యే బీరం సభ దృష్టికి తీసుకు వచ్చారు.
వీలైనంత త్వరగా జటప్రోలు వంతెనకు మరమ్మతులైనా లేదా ప్రత్యామ్నాయంగా మరో వంతెననైనా నిర్మించాలని సీఎం, మంత్రి వేములకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.అలాగే పెంట్లవెల్లి మండల కేంద్రంలోని చౌటచెరువు కట్ట నమాజ్కట్ట రోడ్ ప్రమా దకరంగా మారిందని, అక్కడ వంతెన నిర్మాణం లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే బీరం ఈ సందర్భం గా శాసనసభ దృష్టికి తీసుకొచ్చారు.
మా నియోజకవర్గం గుండా ప్రవహించే కృష్ణానది పై గుందిమళ్ల వద్ద జోగులాంబ వంతెన నిర్మిస్తామని గతంలో ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని ఎమ్మెల్యే బీరం గుర్తు చేస్తూ అక్కడ వంతెన నిర్మాణమైతే అనేక రకాలుగా ప్రయో జనం ఉంటుందన్నారు. సాగు, తాగునీటి సమస్యకు పరిష్కారంతో పాటు కొల్లాపూర్, నాగర్కర్నూల్, నల్గొండ ప్రాంతాల నుంచి అలంపూర్, అక్కడి నుంచి కర్నూల్కు వెళ్లేం దుకు ఎంతో అనువుగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.
చుట్టూ కౄష్ణానది కొల్లాపూర్ గుండా ప్రవహిస్తున్నప్పటికీ చాలా గ్రామాలకు నేటికి సాగు నీటికి ఇబ్బందులు పడుతు న్నట్లు ఎమ్మెల్యే బీరం విచారం వ్యక్తం చేశారు. మొన్న రాష్ట్ర వ్యాప్తంగా వర్షం పడితే మా ప్రాంతంలో మాత్రం వర్షాలు లేవని, దీంతో రైతులు సాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీలైనంత త్వరగా జోగులాంబ వంతెనను కూడా చేపట్టాలని ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఎమ్మెల్యే బీరం విజ్ఞప్తి చేశారు.
రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే హర్షవర్దన్రెడ్డి శాసన సభకు ఎన్నికైన తొలినాళ్ల నుంచి సోమశిల వం తెన, హైవే విషయం గూర్చి పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించారని, కాగా సర్వే ప్రక్రియ పూర్తి కాను న్నదని, ఇది కాగానే భూసేకరణ, ఆ తరువాత టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని తొమ్మిది నెలల్లో పనులు ప్రారంభం కాను న్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు గాను వంతెనకు రూ,600 కోట్లు, మరో రూ,600 కోట్లు హైవే నిర్మాణానికి కేటాయించ డం జరిగిందని ఎమ్మెల్యే హర్షవర్దన్రెడ్డికి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమాధానం చెప్పారు.