కొల్లాపూర్: తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటుతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వంలో కులవృత్తులను పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రోత్స హిస్తున్నదని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి అన్నారు. కొల్లాపూర్ మండలం సింగ వట్నం శ్రీవారిసముద్రం రిజర్వాయర్లో 7లక్షల 80 వేల బొచ్చ, రవుట, మోసు, రోయ్య చేపపిల్లలను మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ సుజాత, అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మప్పతో కలిసి ఎమ్మెల్యే బీరం శనివారం వదిలారు.
ముందుగా ఎమ్మెల్యే గంగమ్మకు పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారులు ఎమ్మెల్యేను గజమాల, శాలు వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మత్స్యకారుల కోరిక మేరకు వారితో కలిసి సరదాగా మరబోటులో అర గంట రిజర్వాయర్లో విహారిస్తూ ఎమ్మెల్యే వల విసరగా నాలుగు పెద్ద చేపలు పడ్డాయి.
ఆనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ సమైఖ్య పాలనలో ఎదుగు బొదుగు లేకుండా పోయిన కులవత్తుల వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. చెరువు ల్లో చేపల పంట పండుతుందని, మత్స్య సంపద పెంపొందించడం ద్వారా మత్స్యకారులు ఆర్థిక పరిపుష్టి సాధిస్తారన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్లు చింతకుంట శ్రీనివాసులు, పెబ్బేటి కృష్ణయ్య, సర్పంచ్ మాండ్ల కృష్ణయ్య, మత్స్య సహాకార సంఘం అధ్యక్షుడు వాకిటి ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు ఎల్ఐసీ నర్సిం హా, కార్యదర్శి స్వామి, ఎన్మన్ బెట్ల, కల్వకోలు, సింగవట్నం మత్స్యకారులతో పాటు మత్స్యశాఖ ఫీల్డ్మెన్ అంజయ్య, ఫీల్డ్ అసిస్టెంట్స్ శ్రీకాంత్, రాజ్కుమార్, కాంట్రాక్టర్ సత్యప్రియ, టీఆర్ఎస్ నాయకులు కిరణ్కుమార్, గాలియాదవ్, ఖాదర్పాషా, సుదర్శన్గౌడ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.