కొల్లాపూర్: కరోనా కష్టకాలంలోనూ రైతులు పండించిన ధాన్యాన్ని నేరుగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయడం జరి గిందని, ఇది రైతు ప్రభుత్వమని ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి అన్నారు. కొల్లాపూర్ మార్కెట్ యార్డులో రూ,కోటి 12లక్షల వ్యయంతో షాపింగ్ కాంప్లెక్స్, సీసీరోడ్డు నిర్మాణానికి పానగల్, చిన్నంబావి మండలాల్లో పెండింగ్లో ఉన్న గోదాంల నిర్మాణాల పనులకు డీసీసీబీ డైరెక్టర్ మామిళ్లపల్లి విష్ణువర్దన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బీరం ఆదివారం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఆనంతరం మార్కెట్ యార్డు హమాలీలకు ప్రభుత్వం మంజూరు చేసిన గుర్తింపు కార్డులను ఆయన పంపిణీ చేశారు. తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి నందుకు హమాలీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను శాలువకప్పి స్వీట్లు తిని పించారు. పట్టణంలోని 4వార్డులో రూ,16లక్షలతో హెల్త్ సెంటర్కి ఆయన భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోళ్ల విషయంలో కొందరు చిల్లర రాజకీయాలు చేయాలని చూశారని విమర్శించారు. 30 ఏండ్లుగా పెండింగ్లో ఉన్న మార్కెట్ యార్డులోని హమాలీలకు గుర్తింపు కార్డుల సమస్య శాశ్వత పరిష్కారమైందన్నారు.
రానున్న కాలంలో కొల్లాపూర్ అభివృద్ధికి చర్యలను తీసుకున్నట్లు చెప్పారు. సింగవట్నం నుంచి గోపల్దిన్నె రిజర్వాయ ర్కు నది నీటిని గ్రావిటీ ద్వారా నింపి 30వేల ఎకరాల రైతుల భూములకు సాగునీరందుతుందన్నారు. ఈ పనులకు టెం డర్ల ప్రక్రియ పూర్తికావచ్చిందన్నారు.
వీటితో పాటు ఎన్మన్బెట్ల వీరనాయిని చెరువు, బాచారం హైలేవల్ బ్రాంచీ కెనాల్, జిల్దార్ తిప్ప ప్రాజెక్టుకు నీటిని అందించే పనులకు నిధులు మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపడం జరిగిందని ఎమ్మెల్యే బీరం పేర్కొన్నారు.