కొల్లాపూర్ : ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు వద్ద MGKLI మోటర్లను ప్రారంభించి మాట్లాడారు.
పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్లను ప్రారంభించి నాగర్కర్నూల్, పాలమూరు జిల్లా కరువు గోసను తీర్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. బీడుబడ్డ భూములు పచ్చగా మారి, వలసలు తగ్గాయంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.