కొల్లాపూర్, డిసెంబర్ 15: ఐదురోజులుగా మాండస్ తుఫాను కారణంగా ముసురు వర్షాలు పడి మామిడితోటలు వివిధ రకాల తెగుళ్ల బారినపడ్డాయి. తెగుళ్ల కారణంగా మామిడిపూత నల్లగా మారడం, పూత రాలిపోవడం, పూతకు బూడిద తెగుళ్లు ఆవహించాయి. అదే విధంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో కొంత వరకు తేనె మంచు ప్రభావం మామిడి చెట్లపై చూపింది. ఇందుకు మామిడి తోటలకు సోకిన తెగుళ్ల బెడద నుంచి కాపాడుకునేందుకుగానూ రైతులు వెంటనే సస్యరక్షణ చర్యలను చేపట్టాలని కొల్లాపూర్ డివిజన్ ఉద్యాన అధికారి లక్ష్మణ్ గురువారం వెల్లడించారు. పూత ఒక మోస్తరులో నల్లగా మారి రాలిపోవడం, బూడిద తెగులు గమనించడం, కొంత భాగం తేనె మంచు పురుగు ఉధృతి ఉండటం, లేదా పూతను ఒక పేపర్పై దులిపినప్పుడు పేనులాంటి నల్లటి తామర పురుగులను గమనించినట్లయితే థయోమిథాైగ్జెమ్ 150 గ్రాములు+మెక్సాకొనోజోల్ లీటరు ఒక ట్రాక్టర్ డ్రమ్ అనగా 500 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
పూత నల్లగా మారడం,బూడిద తెగులు గమనించడం,తామర పురుగులు ఉధృతి కొంచెం అధికంగా ఉన్నప్పుడు ఫిప్రోనిల్ 40%+ఇండక్లోప్రిడ్ 40% WG (పోలీస్) 150 గ్రాములు +టీబూకానజోల్+ట్రీప్లాజ్సీస్టోబిన్(నేటివో) 250 గ్రాములు, ఒక ట్రాక్టర్ డ్రమ్ అనగా 500నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
పూత నల్లగా మారడం,బూడిద తెగులు,నల్ల తామరలు ఉదృతి బాగా అధికంగా గమనించినట్లయితే ఫిప్రోనిల్ 80 WG(80% W/W( jump) 150 గ్రా+హెక్సాకోనోజోల్ 1లీటరు లేదా నెటివో 250 గ్రాములు ఒక ట్రాక్టర్ డ్రం అనగా 500 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
కొన్ని తోటల్లో పూత పిందెగా మారి బఠానీ గింజ సైజులో ఉండి పిందే పసుపు రంగులోకి మారి రాలిపోవడం జరుగుతుంది. 13.0.45,2.5కిలోల ఫార్ములా 4.2.5 కిలోలు +ప్లానోఫిక్స్ 100 మిల్లీ లీటరు,ఒక టాక్టర్ డ్రం అనగా 500 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. తాను సూచించిన క్రిమిసంహారక మందులను మామిడి తోటలో ఉధృతిని లేదా తీవ్రతను బట్టి మాత్రమే పిచికారీ చేసుకోవాలని కొల్లాపూర్ డివిజన్ ఉద్యాన అధికారి లక్ష్మణ్ స్పష్టం చేశారు.