తిమ్మాజిపేట: తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, వారి ఆర్థిక అభివృద్ధి కోసం పాటు పడుతున్నదని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని నేరళ్లపల్లి గ్రామంలోని నడుపులమ్మ చెరువులో మత్సశాఖ అధ్వర్యంలో ఉచితంగా అందిస్తున్న చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మత్సకారుల అభివృద్ది కోసం గత నాలుగు సంవత్సరాలుగా ఉచితంగా చేపపిల్లలను అందిస్తున్నదని, అంతేకాకుండా చేపలను విక్రహించేందుకు వారికి ఉచితంగా వాహానాలను ఇచ్చిన విషయాన్ని ప్రస్థావించారు. నాలుగు సంవత్సరాలుగా చేపల ఉత్పత్రి రాష్ట్రంలో బాగా పెరిగిందన్నారు. దీని ద్వారా వేలాది కుటుంబాలకు ఉపాధి లభించి, ఆర్థికంగా ఎదిగారన్నారు. ఈ సందర్భంగా లక్ష చేప పిల్లలను చెరువులో వదిలారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీంద్రనాథ్రెడ్డి, జడ్పీటీసీ దయాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ నర్సింహారెడ్డి, సర్పంచ్ వేణుగోపాల్గౌడ్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జోగు ప్రదీప్, విండో వైస్ చైర్మన్ రాందేవ్రెడ్డి ,ఉప సర్పంచ్ ప్రదీప్, నాయకులు నర్సిరెడ్డి, ప్రకాశ్, జంగిరెడ్డి, శేఖర్రెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు