కోడేరు: రైతులు ఎప్పుడు సాగు చేస్తున్న వరి పంటలకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న లాభసాటి కూర గాయలు వంటి వ్యాపార పంటలను సాగు చేసుకొవాలని స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి సూచించారు. మండల పరిధి తీగలపల్లిలో ఆదివారం సాయంకాలం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూరగాయల సంతను ప్రారంభించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయరంగంలో రైతుల పాత పద్దతులకు స్వస్తి పలికి నూతన పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. జనాభా పెరుగుతన్న కొద్ది ప్రజల అవసరాలు పెరుగుతున్నందున వారికి అవసరమ య్యే కూరగాయలు వంటి లాభసాటి పంటలను సాగు చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.
కూరగాయల పంటలు సాగటు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తున్నదని ప్రభుత్వం అందజేస్తున్న అన్ని రకాల రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాని కోరారు. కూరగాయలు సాగు చేసే రైతులకు అవసరమైన అన్ని రకాల రాయితీలు అంద చేస్తామన్నారు.
అనంతరం సంతలో కలియతిరిగి కూరగాయలు కొనుగోలు చేసే వారిని, విక్రయించే వారిని వివరాలు అడిగి తెలసుకున్నా రు. అంతకుముందు సంతలో రబ్బన్ కట్ చేసి సంతను ప్రారంభించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాజశేఖ ర్గౌడ్, సర్పంచ్ శివారెడ్డి, ఆంజనేయులు, గ్రామాధ్యక్షుడు బాస్కర్రెడ్డి, విండో డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.