నాగర్కర్నూల్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా నాగర్ కర్నూల్ మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ కొత్త సుమలత కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఆమెకు హైదరాబాద్లోని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కౌన్సిలర్తో పాటు హమాలీ సంఘం అధ్యక్షుడు వంకేశ్వరం రామస్వామి, వై.నిరంజన్, మిద్దె భాస్కర్, గొల్ల మల్లయ్య, మిద్దె వెంకటస్వామి, కందాల నాగయ్య, మహేశ్వరి, మల్లీశ్వరి, మరో 30 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.