హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ‘22ఏ నిషేధిత జాబితాను అడ్డుపెట్టుకొని సామాన్యుల భూములపై నాలుగు దశల్లో దోపిడీ జరుగుతున్నది.. అది అర్బన్ ల్యాండ్ సీలింగ్ కాదు.. అర్బన్ పీపుల్స్ లూటింగ్’ అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన పట్టా భూములను సైతం ఒక క్లిక్తో నిషేధిత జాబితాలోకి చేర్చి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని మంగళవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
22ఏలో భూమి చేరిన బాధితులను గ్రీవెన్స్, ఫైల్ ప్రాసెసింగ్ పేరుతో రోజుల తరబడి తహసీల్దార్, కలెక్టరేట్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు తిప్పుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నంబర్ 1800 599 4788 కూడా పనిచేయడం లేదని పేరొన్నారు. ఇదే అదునుగా బాధితులను రియల్ ఎస్టేట్ దళారులు, అధికార పార్టీ బినామీలు లక్ష్యంగా చేసుకుంటున్నారని అతి తకువ ధరకు భూములు విక్రయించేలా ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.