నాగర్కర్నూల్, డిసెంబర్ 15: ప్రభు త్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేం ద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్ద తు ధర పొందాలని అదనపు కలెక్టర్ మోతీలాల్ సూచించారు. మండలంలోని నల్లవెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా విక్రయానికి ధాన్యం తెచ్చి న రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం తేమశాతం పరిశీలించి వెంటనే కొనుగోలు చేయాలని అధికారుల ను ఆదేశించారు. తేమశాతం లేకుండా ధా న్యం తెచ్చి మద్దతు ధర పొందాలని రైతుల కు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం విక్రయించిన రైతులకు 48గంటల్లో డ బ్బులను ఇప్పిస్తున్నామన్నారు. జిల్లా వ్యా ప్తంగా 9,386మంది రైతులతో 59,900 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటివరకు కొ నుగోలు చేసినట్లు తెలిపారు. రూ.90కోట్లు జిల్లాకు విడుదల కాగా ఇప్పటివరకు రూ. 80కోట్లు రైతులకు చెల్లించినట్లు తెలిపారు. మరోరూ.10 కోట్లు గురువారం రైతుల ఖా తాల్లోకి విడుదల చేస్తున్నామన్నారు. జిల్లా లో దాదాపుగా 30లక్షల గన్నీబ్యాగులు ఉ న్నాయని, గన్నీ బ్యాగుల కొరత లేదన్నారు. అదనపు కలెక్టర్ వెంట సివిల్ సప్లయ్ డీఎం బాలరాజు, ఇతర అధికారులు ఉన్నారు.