నాగర్కర్నూల్, జనవరి 19: జంతువులు, వన్యప్రాణులపై కరుణతో వ్యవహరించాలని కలెక్టర్ ఉదయ్కుమార్ సూచించారు. జనవరి 14 నుంచి 31వ తేదీ వరకు జరుగుతున్న జంతు సంక్షేమ వక్షోత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టరేట్లో జంతు సంక్షేమ సంస్థ చైర్మన్, కలెక్టర్ అధ్యక్షతన పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జంతువులను హింసించడం, వాటిని బహిరంగంగా బలిచేయడం, వన్యప్రాణులను వేటాడడం వంటివి నేరంగా పరిగణిస్తామని హెచ్చరించారు. జంతువులు, వన్యప్రాణులపై కరుణ చూపించాలని, ఎక్కడైన దొరికితే అటవీశాఖ వారికి అప్పగించడం, అడవిలో వదిలేయడం చేయాలన్నారు. పెంపుడు జంతువులకు ఎప్పటికప్పుడు రోగనిరోధక టీకాలు ఇప్పించాలని సూచించారు. మాంసానికి ఉపయోగించే మేకలు, గొర్రెలు వాటిని బహిరంగ ప్రదేశాల్లో కాకుండా స్లాటర్ కేంద్రాల్లోనే వధించాలని, అదికూడా వైద్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి అనారోగ్యంతో లేదని డాక్టర్ ద్వారా ధ్రువీకరణ పొందాకే బలిచేయాలన్నారు. వీధి కుక్కలను నియంత్రించడానికి ఏబీసీ కేంద్రం నిర్మాణం త్వరలో పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు.
రోడ్లపై జంతువులను వదిలితే వాటిని ఒకచోట బంధించేవిధంగా బందెలదొడ్డి ఏర్పాటు చేయాలని, రోడ్డుపై జంతువులను వదిలేసిన యజమానులకు జరిమానా విధించాలన్నారు. జరిమానా కట్టడానికి ముందుకురాని పక్షంలో నామమాత్రపు రుసుము తీసుకొని ఇతరులకు ఇచ్చేయాలని సూ చించారు. జంతువులను వాహనంలో తరలించేటప్పుడు ఒకే వాహనంలో ఇ రుకుగా ఎక్కువ జంతువులను తరలిస్తే గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పెంపుడు జంతువులను అమ్మడం, కొనడం నేరమని, అందు కు రిజిస్టర్ చేసుకొని అనుమతి పత్రం పొంది ఉండాలని తెలియజేశారు. పెం పుడు జంతువులను ప్రేమించే విధం గా పిల్లలకు ఆసక్తి కలగడానికి పాఠశాలల్లో వ్యాస రచన పోటీలు నిర్వహించాలని డీఈవోను ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రామేశ్వర్రా వు, జిల్లా పశుసంవర్ధక అధికారి జీవీ. రమేశ్, ఆర్టీఏ ఎర్రిస్వామి, మున్సిపల్ కమిషనర్ జయంత్కుమార్, జంతు సంక్షేమసంస్థ ఉపాధ్యక్షుడు భూపాల్రెడ్డి, సభ్యులు, రోహిత్రెడ్డి, సుధాకర్రెడ్డి, మార్కెటింగ్ అధికారిణి బాలమణి, డీఈవో గోవిందరాజులు ఉన్నారు.
కలెక్టరేట్ నూతన భవన పనుల పరిశీలన
సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఉదయ్కుమార్ ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్ను గురువారం పరిశీలించిన కలెక్టర్ పనులు త్వరగా పూర్తి చేసేందుకు లేబర్ సంఖ్యను మరింత పెంచాలని కాంట్రాక్టర్కు సూచించారు. ముఖ్యంగా నిర్మాణ పనులకు తుది మెరుగులు దిద్దే కార్యక్రమం నడుస్తున్నప్పటికీ ప్రాంగణంలో గార్డెనింగ్, మొక్కలు నాటడం, సుందరీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన మొక్క లు మాత్రమే నాటాలని వారం పదిరోజుల్లో మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ నూతన క్యాంపు కార్యాలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఫిబ్రవరి 15వ తేదీవరకు పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచిస్తూ ఇందుకు రోడ్లు భవనాల కార్యనిర్వాహక ఇంజినీర్ పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్అండ్బీ కార్యనిర్వాహక ఇంజినీర్ భాస్కర్ మున్సిపల్ కమిషనర్ జయంత్కుమార్, కాంట్రాక్టర్లు ఉన్నారు.