నాగర్కర్నూల్: జిల్లాలోని ఉప్పునుంతలలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. ఉప్పునుంతల సమీపంలోని గొర్రెల మంద, ఆవు దూడపై సోమవారం తెల్లవారుజామున చిరుత దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఎనిమిది గొర్రెలు, ఓ ఆవు దూడ మృతి చెందాయి. గుర్తించిన మంద యజమాని పోలీసులు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సూచించారు. చిరుతపులి సంచారంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. చిరుతను వీలైనంత తొందరగా పట్టుకోవాలని అధికారులను కోరుతున్నారు.