నాగర్కర్నూల్, డిసెంబర్ 27 : నాబార్డు 2023-24 సంవత్సరానికి గానూ నాబార్డు ద్వారా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ కరదీపికను మంగళవారం కలెక్టర్ ఉదయ్కుమార్ ఆవిష్కరించారు. నాగర్కర్నూల్ జిల్లాకు ప్రతి సంవత్సరం పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్(పీఎల్పీ)ని సిద్ధం చేస్తుందని, ప్రాధాన్యతా విభాగంలో జిల్లాలో అందుబాటులో ఉన్న భౌతిక, ఆర్థిక సామర్థ్యాన్ని అంచ నా వేస్తుంది. దీని ఆధారంగా చేసుకొని జిల్లాలోని లీడ్ బ్యాంక్ వివిధ బ్యాంకుల ద్వారా అమలు చేయడానికి వార్షిక జిల్లా క్రెడిట్ ప్లాన్(ఏసీపి)ని సిద్ధం చేస్తుంది. దీని ప్రకారం నాగర్ కర్నూల్కు సంబంధించిన 2023024 పీఎల్పీని మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఉదయ్కుమార్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. పంట ఉత్పిత్తి నిర్వహణ, మార్కెటింగ్ కోసం రూ.3456.17కోట్లు, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల కోసం టర్మ్లోన్ రూ.804.57 కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం రూ.95.34 కోట్లు, అనుబంధ కార్య కలాపాల కోసం రూ.608.70 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల(ఎంఎస్ఎంఈ)కోసం రూ.413.81 కోట్లు సహా జిల్లా మొత్తం ప్రాధాన్యతారంగానికి రూ.5574.84 కోట్లుగా నాబార్డు ఆర్థిక అంచనా వేసింది. కార్యక్రమంలో డీడీఎం షణ్ముఖాచారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్డీఎం కౌశల్కిశోర్పాండే, సీపీవో భైపాల్రెడ్డి, వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు, డీపీఆర్వో సీతారాం, భూగర్భజల అధికారి రమాదేవి, హార్టికల్చర్ అధికారి చంద్రశేఖర్, మత్స్యశాఖ అధికారి డాక్టర్ లక్ష్మప్ప తదితరులు పాల్గొన్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి
నాగర్కర్నూల్టౌన్, డిసెంబర్ 27 : మత్స్య సంపదను దోపిడీ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్య సహకార సంఘం మండలాధ్యక్షులు హరికృష్ణ అన్నారు. మంగళవారం మండలంలోని గుడిపల్లి గ్రామంలో మత్స్యకారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపల వృత్తిపై జీవనం సాగిస్తున్న మాపై దాడులు చేయడం సిగ్గు చేటన్నా రు. చేపలవేటకు ఎలాంటి అనుమతులు లేకుండా చేపలు పట్టి మత్స్య సంపదను దోపిడీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో మండల కమిటీ ప్రచార కార్యదర్శి భీమ య్య, చిన్నయ్య, పర్వతాలు, కేశవులు, చందు, జానకిరాము, అజ్మీర్, శివ, లక్ష్మయ్య, రాము తదితరులు ఉన్నారు.