శ్రీశైలం, నవంబర్ 18 : శ్రీశైలం క్షేత్రంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జ్వాలాతోరణానికి ఉపయోగించే ఒత్తులను ఈవో లవన్న ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. గురువారం ఉదయం రాజగోపురం వద్ద ఒత్తులకు ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రవేశం చేశారు. నూలు పోగు ఒత్తులను ప్రకాశం జిల్లా వేటపాలం మండ లం ఆమోదగిరి పట్నానికి చెందిన వసుంధరరావు కుటుంబీకులతో వచ్చి ఆలయానికి అప్పగించడం ఆచారమని ఈ వో తెలిపారు. సాయంత్రం గంగాధర మండపం వద్ద ఒత్తులకు షోడశోపచార పూజలు చేశారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో తీసుకొచ్చి దీప ప్రజ్వలన జరిపించారు. పున్నమి వెలుగుల్లో నిర్వహించిన జ్వాలాతోరణోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తోరణం భ స్మాన్ని నుదుటిన పెట్టుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. భక్తులు ఆలయంలో సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలు, వృద్ధ మల్లికార్జున స్వామికి బిల్వార్చన చేశారు. ద క్షిణ మాడవీధిలో నిర్వహించిన కళారాధన కార్యక్రమంలో మహబూబ్నగర్కు చెందిన శ్రీసాయికృప కూచుపూడి నృ త్య అకాడమీ, హైదరాబాద్కు చెందిన తాండవం కూచుపూడి నాట్యాలయం వారు భక్తిగీతాలకు నృత్యం చేశారు. మహబూబ్నగర్కు చెందిన చిన్నారులు శ్లోక, వర్షిత, అక్ష ర, రాగసుధ, పరిమళ, అమూల్య, కల్పన, మేఘన, తనూ శ్రీ, ఆదిశ్రీ, చైత్రిక, శ్రేష్ట, వాణి చేసిన శివాష్టకం, మహాగణపతిం, నమ్మశ్శివాయతే గీతాల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
వైభవంగా లక్షదీపార్చన..
కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉభయ దేవాలయాల్లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలతోపాటు పరివార దేవతలకు షోడశోపచార పూజలు చేశారు. సాయంత్రం పల్లకీలో ఆలయ ప్రదక్షిణ చేసి పుష్కరిణి వద్ద అధిష్టింపజేసి సంకల్ప పూజాధికాలు నిర్వహించారు. అనంతరం లక్ష దీపార్చన లో భాగంగా భక్తులచే దీపాలు వెలిగించారు. పుష్కరిణికి ఇస్తున్న దశవిధ హారతులను భక్తులు దర్శించుకున్నారు. కా ర్యక్రమంలో నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శి ల్పాచక్రపాణిరెడ్డి, విద్యాగణేశానంద భారతి పీఠాధిపతు లు, అర్చకులు భద్రయ్య, మార్కండేయ శర్మ, హరిస్వామి, ఈఈ మురళీబాలకృష్ణ, శ్రీశైలప్రభ సంపాదకుడు అనీల్కుమార్, పీఆర్వో శ్రీనివాసరావు, పర్యవేక్షకుడు శ్రీహరి, ఆ లయ ముఖ్య భద్రతా అధికారి నర్సింహారెడ్డి, అయ్యన్న, రవికుమార్ పాల్గొన్నారు.
ఇష్టకామేశ్వరి ఆలయ దర్శనం ప్రారంభం..
శ్రీశైలం క్షేత్రానికి పరివార దేవత అయిన ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనాలు పున:ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వెళ్తుంటారు. ఈ క్రమంలో కొందరు భక్తులను దోచుకుంటున్నారని అటవీ శాఖ మూడేండ్లుగా దర్శనానికి అనుమతిని రద్దు చేసింది. ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి అధికారులతో చర్చించి అనుమతి ఇప్పించారు. అటవీ ప్రాంతంలో ఆలయానికి వెళ్లేందుకు రోడ్డును కూడా ప్రారంభించారు. ప్రస్తుతం రోజుకు 10 వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.