తాడూరు, సెప్టెంబర్ 25 : రైతుబీమా పథకం రైతులకు ధీమానిస్తున్నదని, ఏకారణంగానైనా మృతి చెందిన ఆ రైతుల కుంటుంబాలను వీధిన పడకుండ ప్రభుత్వం ఆదుకుంటున్నదని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఇంద్రకల్, యాదిరెడ్డిపల్లి, అంతారం గ్రామాల్లో ఆయన పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ కేసీఆర్ సీఎం అయ్యాక మర్రి జనార్దన్రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక వాన కోసం ఎవరైనా మేఘాల దిక్కు చూస్తున్నారా ప్రశ్నించారు. గతంలో ఓటు వేశారు, ఇప్పుడు ఓటు వేశారు కానీ గతం లో మన గ్రామం ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడాలన్నారు. గతంలో ఎన్ని ఎకరాల భూమి ఉన్నా పడావు పెట్టి హైదరాబాద్, ముంబాయి వలస వెళ్లారని, కానీ ఈ రోజు వలస వెళ్లిన ప్రతిఒక్కరూ వచ్చి గ్రామాల్లో అద్భుతంగా వ్యవసాయం చేసుకుంటు జీవిస్తున్నారన్నారు.
గత 60 ఏండ్లుగా రాని కరెంట్, నీళ్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో ఆలోచించాలన్నారు. దాని వెనుక సీఎం కేసీఆర్ కఠోర శ్రమ ఉందన్నారు. గతంలో తొలుసూరు కాన్పులో ఆడపిల్ల వద్దు మగపిల్లవాడు కావాలని ఎంత మంది దేవుళ్లకు మొక్కారు. ఆడపిల్ల పుడితే ఎంతో బాధ పడ్డాం కానీ ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డాకా ప్రతి ఆడబిడ్డకు పెద్దపీట వేశామన్నారు. గతంలో తాగునీటి కోసం బోరింగ్లు కొట్టి కొట్టి మన భుజాలు నొప్పిపట్టేవని, ఈ రోజు మన ఇంటి ముందుకే నల్లాను తీసుకువచ్చామన్నారు. ఇప్పటి వరకు 1,174మంది రైతులకు రైతుబంధు రూ.19కోట్ల ఇంద్రకల్ రైతుల ఖాతాల్లో పడ్డాయని, 330మందికి ఆసరా పింఛన్ల ద్వారా రూ.5కోట్లు వచ్చాయని, గ్రా మంలో కల్యాణలక్ష్మి ద్వారా 57మందికి రూ. 57 లక్షల రూపాయలు వచ్చాయని, రైతుబీమా ద్వారా 26 మందికి రూ.ఐదు లక్షల చొప్పున రూ.కోటీ 30 లక్షల రూపాయలు వచ్చాయని వివరించారు. ఇంద్రకల్ నుంచి యాదిరెడ్డిపల్లి గ్రామాల మధ్యలో రూ.రెండు కోట్ల 20లక్షలతో బ్రిడ్జి నిర్మించినట్లు చెప్పారు.
ఇంద్రకల్ గ్రామంలో మిగిలిన సీసీరోడ్లు, డ్రైనేజీలు రాబోయే రోజుల్లో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బైకని శ్రీనివాస్ యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హన్మంతరావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు యార రమేశ్, ఎంపీపీ శ్రీదేవి, వైస్ ఎంపీపీ శివలీల, సర్పంచులు శ్రీదేవి, రజిత, నాగరాజు, అశోక్కుమార్, రమణ, జయమ్మ, ఇంధుమతి, విండో చైర్మన్ సమ్మద్పాషా, విండో ఉపాధ్యక్షుడు వెంకట్రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ జైపాల్రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.