వనపర్తి, మార్చి 22 : బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ మే లేదని, వరుసగా రాష్ట్రంలో మూడోసారి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనపర్తి మండలం అప్పాయిపల్లి గ్రామానికి చెందిన 40 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పాగునంటి విజయ్మోహన్, అజయ్కుమార్ ఆధ్వర్యంలో మరికొందరు నాయకులు మంత్రి సమక్షంలో గులాబీ పార్టీ తీ ర్థం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మందికి ఆసరా పింఛన్లు, 65 లక్షల మందికి రైతుబంధు, లక్ష మందికి రైతుబీమా, 13 లక్షల మందికి కల్యాణలక్ష్మి, 15 లక్షల మందికి కేసీఆర్ కిట్, కొత్తగా న్యూట్రిషన్ కిట్లను ఇ స్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. స్వరాష్ట్ర పాలన ఏర్పడిన తర్వాత వెయ్యికిపైగా గురుకుల పాఠశాలలు నిర్వహిస్తున్న రాష్ట్రం మనదేనన్నారు.
విద్య, వైద్యం, తాగు, సాగునీరు, ఉపాధి రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పని చేసే ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉంటాయన్నారు. రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కడుతున్నారని చెప్పారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టిందని పేర్కొన్నారు. వివిధ రంగాలలో కేంద్రం ఇస్తున్న అవార్డులే ఇందుకు నిదర్శనమని తెలిపారు.
పంచాంగం పుస్తకావిష్కరణ..
వనపర్తికి చెందిన పండితులు ఓరుగంటి మనోహరశర్మ, ఓరుగంటి నాగరాజు శర్మ రూపొందించిన శోభకృత నామ సంవత్సర పంచాంగం పుస్తకాన్ని జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మం త్రి నిరంజన్రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పండితులు ఉగాది పండుగ సందర్భంగా మంత్రిని వేద మంత్రాలతో ఆశ్వీరదించారు.
చెరువుల పునరుద్ధరణతోనే పూర్వవైభవం..
వర్షాలు పడక బీటలు వారిన చెరువులను మిషన్ కాకతీయతో అభివృద్ధి చేసి కృష్ణా జలాలతో నింపామని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. చెరువులను పునరుద్ధరించడం వల్లే నేడు సాగునీటి వనరులు పుష్కలమయ్యాయని చెప్పారు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాసపూర్ పరిధిలో ఉన్న లక్ష్మీకుంటను స్థానిక నాయకులతో కలిసి మంత్రి పరిశీలించారు. కృష్ణమ్మ రాకతో వేసవిలో సైతం చెరువులు జలకళను సంతరించుకున్నాయని తెలిపారు. ఇప్పటికే భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని వివరించారు. రైతులకు సాగునీటి కష్టాలు ఉండవన్నారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటిశ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, కౌన్సిలర్లు పుట్టపాకుల మహేశ్, భాష్యానాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాణి క్యం, నాయకులు పాల్గొన్నారు.
‘ఆత్మీయ సమ్మేళనం’ స్థల పరిశీలన
ఈ నెల 25వ తేదీన జిల్లా కేంద్ర ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. పట్టణంలోని తాళ్ల చెరువు సమీపంలో సమ్మేళన కార్యక్రమానికి సంబంధించిన స్థలాన్ని బుధవారం మంత్రి పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిప ల్ చైర్మన్ గట్టు యాదవ్కు సూచించారు. మంత్రి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, కౌన్సిలర్లు కృష్ణ య్య, కృష్ణ, నాయకులు కృష్ణయ్య, శరవంద, ప్రేమ్నాథ్రెడ్డి, గులాంఖాదర్, నర్సింహ పాల్గొన్నారు.