పెబ్బేరు, ఏప్రిల్ 8 : పర్యావరణానికి గొడ్డలిపెట్టు గా మారిన ప్లాస్టిక్ వస్తువు ల వాడకం తగ్గించాలని ప ర్యావరణ వేత్తలు సూచిస్తున్నప్పటికీ సమాజంలో మార్పు రావడంలేదు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ బదు లు వెదురుతో ఎన్నో ఉపకరణాలు, బొమ్మలు త యారీచేసి వినియోగించుకోవచ్చని పెబ్బేరుకు చెం దిన హెచ్ఎం మురళీకృష్ణ నిరూపించాడు. వెదురు తో ఉన్న అనుబంధం వల్ల ఎన్నో ప్రయోగాలు చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న మురళీకృష్ణ.. వెదురుతో రకరకాల వస్తువులు తయారుచేశాడు. ఆయన నైపుణ్యాన్ని ఎన్నో సంస్థలు అభినందించా యి. వెదురుతో వస్తువులను తయారుచేయడమే కా కుండా.. వెదురు ప్రాధాన్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పేందుకు పలు వైజ్ఞానిక ప్రదర్శనలకు హాజరవుతూ అవగాహన కల్పిస్తున్నారు. బొంగులతో ఇ ల్లు, బస్సు, బావి, విమానం, రథం, బతుకమ్మ, దూరదర్శన్, పూలకుండితో పాటు విద్యార్థుల బో ధనకు ఉపయోగపడే వాటిని రూపొందించాడు. ఆ దరణ లభిస్తే నిత్యం ఉపయోగించే ప్రతి వస్తువును వెదురుతో తయారు చేసుకోవచ్చని అంటున్నాడు.
మానవాళి ప్రగతికి దోహదం..
మానవాళి ప్రగతికి వెదురు ఎంతో దోహదం చేస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించి ప్రోత్సహించాలి. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలి. పర్యావరణానికి హాని చేయని వెదురు, మట్టి వస్తువుల వినియోగంపై అవగాహన కల్పించాలి. సుస్థిరాభివృద్ధి సాధించేందుకు స్థానికంగా తయారైన బొమ్మలతో ఓకల్ ఫర్ లోకల్ నినాదాన్ని అమలుచేయాలి. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం విద్యార్థులకు ఉపకరణాలతో కూడిన బోధనలో వెదురుకు ప్రాధాన్యమివ్వాలి.
– మురళీకృష్ణ, హెచ్ఎం