ఫలించిన ఎమ్మెల్యే చిట్టెం కృషి
మక్తల్రూరల్, మే 22: ఎట్టకేలకు మక్తల్ పట్టణానికి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు మంజూరైంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి చొరవ తీసుకొని మక్తల్కు మున్సిఫ్ కోర్టు మంజూరు చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఏండ్లుగా మక్తల్లో కోర్టు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధుల ఆకాంక్ష. గతంలో ఎమ్మెల్యేలకు, మం త్రులకు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ఫలించలేదు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వైఫల్యంతో 30 ఏండ్లుగా కోర్టు ఏర్పాటు కలగానే మిగిలింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే చిట్టెం కృషితో మక్తల్ మున్సిపాలిటీ ఏర్పడటంతోపాటు మున్సిఫ్ కోర్టు ఏర్పాటు హర్షణీయం. దీంతో ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
భవనాలను పరిశీలించిన అదనపు మెజిస్ట్రేట్, ఎమ్మెల్యే చిట్టెం
మక్తల్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం పక్కన మండల మహిళా సమాఖ్య భవనంలో కోర్టు ఏర్పాటుకు అవసరమైన భవనాలను ఎమ్మెల్యే చిట్టెంతో కలిసి మహబూబ్నగర్ జిల్లా అదనపు మెజిస్ట్రేట్ సంతోశ్కుమార్ పరిశీలించారు. ఎంపీపీ కార్యాలయం ఆవరణలో కోర్టు ఏర్పాటు చేయడం వల్ల భద్రతపరంగా తీసుకోవాల్సిన చర్యలను, అందరికీ అందుబాటులో ఉండేవిధంగా అనుకూలంగా ఉంటుందని ఎమ్మెల్యే చిట్టెం సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్ రాజాసింగ్, ఎస్సై రాములు, ఆర్ఐ కృష్ణారెడ్డి, మాగనూర్ పీఏసీసీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్గుప్తా, మండల కమిటీ అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహగౌడ్, పార్టీ నాయకులు మధుసూదన్రెడ్డి, గాలిరెడ్డి, నేతాజీరెడ్డి, ఈశ్వర్యాదవ్ పాల్గొన్నారు.