మహబూబ్నగర్ : మున్సిపల్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకున్న మహబూబ్నగర్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ను ఏసీబీ (ACB) అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. పట్టణానికి చెందిన పీట్ల యాదయ్య అనే మున్సిపల్ కాంట్రాక్టర్కు రావాల్సిన రూ.11 లక్షలను ఉన్నతాధికారులు విడుదల చేశారు. అందుకు కావాల్సిన ఎంబీ రికార్డుల కోసం యాదయ్య మున్సిపల్ ఏఈ (Muncipal AE) పృథ్వీని సంప్రదించగా ఆయన లంచం డిమాండ్ చేశాడు.
చివరకు కుదిరిన ఒప్పందం మేరకు శనివారం రూ.50 వేలు బాధితుడు ఏఈకి ఇస్తుండగా మాటు వేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్హ్యండెడ్గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని అధికారులు వివరించారు. అధికారులు, ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 అనే టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని సూచించారు.