వనపర్తి, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : మహబూబ్నగర్ స్థానికసంస్థల ఉప ఎన్నికల్లో వనపర్తి జిల్లా నుంచి వందశాతం పోలింగ్ జరిగింది. ఎమ్మెల్యే మేఘారెడ్డితోపాటు మిగిలిన 218 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాగా ఏదుల ఎంపీటీసీ నరేందర్ 20 రోజుల కిందట ప్రమాదానికి గురై హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాడు. కోమాలోకి వెళ్లిన ఎంపీటీసీ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో ఓటింగ్ కోసం ప్రత్యేక అంబులెన్స్లో తీసుకొచ్చి స్ట్రచర్ మీదనే పోలింగ్ కేంద్రానికి చేరుకొని అతని భార్య సహకారంతో ఓటు వేశారు. అమడబాకుల ఎంపీటీసీ శేషిరెడ్డి తన కుమారుడి వివాహం హైదరాబాద్ సాగర్ రింగ్రోడ్డులో గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించారు. 12 గంటల వరకు తంతు కొనసాగించిన శేషిరెడ్డి హుటాహుటిని బయలుదేరి పోలింగ్ కేంద్రానికి పరుగెత్తుకొచ్చి ఓటు వేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా శేషిరెడ్డి ఓటింగ్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయేవారు.