రాజాపూర్, ఫిబ్రవరి 29 : దైవచింతనతో మానసిన ప్రశాంతత చేకూరుతుందని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చొక్కంపేట చించోడ్ రేణుకాదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఉమారామలింగేశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను నిర్వహించారు. వేడుకలకు హాజరై పూజలు చేశారు.
అనంతరం వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేసి మొక్కులు చె ల్లించుకున్నారు. నిర్వాహకులు భక్తులకు అన్నదా నం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సుశీల, వైస్ ఎంపీపీ మహిపాల్రెడ్డి, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, గిరిధర్రెడ్డి, నిశితరెడ్డి, మాజీ సర్పంచులు కృష్ణ య్య, సేవ్యానాయక్, అజీమ్, కాశన్న, వెంకటయ్యగౌడ్, శేఖర్రెడ్డి, రామకృష్ణగౌడ్ తదితరులున్నారు.