జడ్చర్ల, మార్చి 17 : మండలంలోని రామస్వామిగుట్ట తండాలో సేవాలాల్ మహారాజ్ ఉత్సవా లు ఆదివారం ప్రారంభమయ్యాయి. వేడుకల్లో మ హబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి వేర్వేరుగా హాజరై దుర్గామా త, సేవాలాల్ను దర్శించుకుని పూజలు చేశారు. అంతకుముందు ఆలయం వద్ద వేదపండితులు హోమం నిర్వహించి మాజీ సర్పంచ్ గంగ్యానాయ క్ అందజేసిన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో పూజారి చంద్రూనాయక్, మాజీ ఎంపీపీ వెంకటయ్య, మాజీసర్పంచులు రాజుగౌడ్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్, మార్చి 17 : విద్యార్థుల్లో దా గి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. పాలమూరు రెడ్డి సేవా సమితి 22వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం లో హాజరై మాట్లాడారు. రెడ్డి కార్పొరేషన్ ద్వారా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రో త్సహించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాస్రెడ్డి, మధుసూదన్రెడ్డి, వెంకట రంగారెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.